లండన్ వీధుల్లో సిగరెట్లు తాకుతూ... బయో బబుల్ దాటి ఎంజాయ్ చేసిన లంక క్రికెటర్లు...
ఒకప్పుడు టీమిండియాతో సమానంగా పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీలంక జట్టు, ఇప్పుడు దారుణంగా విఫలమవుతోంది. వరుస ఓటములతో టీ20 వరల్డ్కప్ సూపర్ 12 రౌండ్కి అర్హత సాధించలేకపోయిన లంక జట్టు, మరిన్ని చిక్కుల్లో పడింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు, మూడు టీ20 మ్యాచుల్లో ఓడి, 3-0 తేడాతో సిరీస్ ఓడింది. వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
తాజాగా శ్రీలంక క్రికెటర్లు కుశాల్ మెండీస్, నిరోశన్ డిక్వాలా... బయో బబుల్ నిబంధనలు బ్రేక్ చేస్తూ దొరికిపోయారు. లండన్ వీధుల్లో సిగరెట్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ఈ ఇద్దరు క్రికెటర్ల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...
ఈ వీడియోలు వైరల్ కావడంతో కుశాల్ మెండీస్, డిక్వాలాలు ఎంక్వైరీ ఎదుర్కోబోతున్నారు. నిజంగానే వీళ్లు బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు నిరూపితమైతే, వన్డే సిరీస్ నుంచి వీరిని తప్పించడం జరుగుతుంది.
ఒకప్పుడు జయవర్థనే, కుమార సంగర్కర, దిల్షాన్ వంటి స్టార్ ప్లేయర్లతో వెలుగొందిన శ్రీలంక జట్టు, ఇప్పుడు ఆఫ్ఘాన్ కంటే ఘోరంగా ఆడుతూ చిత్తుగా ఓడుతోంది.
ఆఫ్గనిస్తాన్ జట్టు నేరుగా టీ20 వరల్డ్కప్ సూపర్ 12 రౌండ్కి ఎంపిక కాగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు... ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఓమన్, న్యూ జెనివా వంటి పసికూన జట్లతో పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంది.