గబ్బర్తో పెట్టుకుంటే ఇంతే... ట్రోల్ చేయాలని చూసిన నెటిజన్కి కౌంటర్ ఇచ్చిన శిఖర్ ధావన్...
టీమిండియా బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. గాయాల కారణంగా చాలాసార్లు జట్టుకు దూరమయ్యాడు కానీ లేకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సమానంగా ధావన్ కూడా రాణించేవాడు. ప్రత్యేకమైన యాటిట్యూడ్, స్టైల్తో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శిఖర్ ధావన్... తనను ట్రోల్ చేయాలని చూసిన వారికి గట్టిగా సమాధానమిస్తాడు.
తాజాగా ‘గబ్బర్’ను టార్గెట్ చేయాలని చూసి అబాసుపాలయ్యాడో నెటిజన్.
239 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన శిఖర్ ధావన్... 24 శతకాలతో 9709 పరుగులు చేశాడు. అత్యంత వేగంగా ఐసీసీ టోర్నమెంట్లలో 1000 పరుగులు పూర్తిచేసుకున్న క్రికెటర్గా ఉన్నాడు ‘గబ్బర్’.
ఐపీఎల్ 2020లో స్టార్ పర్ఫామెన్స్ ఇచ్చిన శిఖర్ ధావన్, ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో మాత్రం ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.
టెస్టు సిరీస్లో చోటు దక్కించుకోని శిఖర్ ధావన్... టీ20 సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి పయనమయ్యాడు.
ఈ సందర్భంగా యజ్వేంద్ర చాహాల్, దీపక్ చాహార్లతో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్టు చేశాడు శిఖర్ ధావన్.
ఈ ఫోటోలో ఉరిమి చూస్తున్న చాహాల్ను ఉద్దేశించి... ‘కళ్ల గుడ్లు పీకేసి గోలీలాట ఆడుతాం..’ అంట సరదాగా రాసుకొచ్చాడు ధావన్.
ఈ ఫోటోపై కామెంట్ చేసిన ఓ నెటిజన్... ‘ చెత్త మొహాలు... చెత్త గేమ్ ప్లే’ అంటూ కామెంట్ చేశాడు.
దీనిపై స్పందించిన శిఖర్ ధావన్... ‘అవును... మీ ఇంట్లో వాళ్లు కూడా నీ గురించి ఇదే అనుకుంటున్నారు...’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.
చివరన నవ్వుతున్న ఎమోజీ పోస్టు చేసి, సదరు వ్యక్తికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆసీస్ టూర్లో మూడు వన్డేలు ఆడిన శిఖర్ ధావన్... 120 పరుగులు చేశాడు. మూడు టీ20ల్లో కలిపి 82 పరుగులు చేశాడు.
మొదటి టీ20లో రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చి మూడు వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్, మిగిలిన రెండు టీ20 మ్యాచుల్లో భారీగా పరుగులు ఇచ్చాడు.
మరోవైపు దీపక్ చాహార్ టీ20 సిరీస్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. మూడు టీ20ల్లో కలిపి ఒకే ఒక్క వికెట్ తీసిన చాహార్, భారీగా పరుగులు సమర్పించుకోవడమే కాకుండా ఫీల్డింగ్లో క్యాచులు జారవిరిచాడు.