లంక టూర్లో భారత జట్టుకి షాక్... గాయంతో వన్డే సిరీస్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం...
శ్రీలంక టూర్లో ఉన్న భారత జట్టుకి వన్డే సిరీస్ ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్, వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
తొలి వన్డేలో గాయం కారణంగానే సంజూ శాంసన్, తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ మోకాలికి అయిన గాయం తగ్గడానికి సమయం పడుతుందని డాక్టర్లు తేల్చడంతో అతను వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
సంజూ శాంసన్ స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ను ఎంపిక చేస్తారా? లేక జట్టుతో ఉన్న ఇషాన్ కిషన్నే కొనసాగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
టీ20 వరల్డ్కప్ ప్రాబబుల్స్ టీమ్ ఎంపిక చేసేందుకు ప్రాక్టీస్గా భావిస్తున్న లంక సిరీస్ నుంచి గాయం కారణంగా తప్పుకోవాల్సి రావడం సంజూ శాంసన్ దురదృష్టమనే చెప్పాలి.
టీ20 సిరీస్ సమయానికి సంజూ శాంసన్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని, బరిలో దిగితే అతనికి అవకాశం దొరకొచ్చు.