కపిల్దేవ్ తప్ప అందరూ ఫెయిల్... సచిన్, కోహ్లీ, రోహిత్లకు తప్పని ఓటమి..
శ్రీలంకతో సిరీస్లో కెప్టెన్గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. లంక సిరీస్ ద్వారా కెప్టెన్గా మారుతున్న ఐదో భారత క్రికెటర్ శిఖర్ ధావన్. ఇంతకుముందు కపిల్దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించారు...
భారత్, శ్రీలంక మధ్య జరిగే వన్డే సిరీసుల్లో అత్యధిక విజయాలు సాధించింది భారత జట్టే. అయితే కెప్టెన్లుగా లంకపై ఆడిన మొదటి మ్యాచుల్లో మాత్రం వీరికి (కపిల్ దేవ్ మినహా) పరాజయమే దక్కింది...
1982లో తొలిసారిగా కెప్టెన్గా శ్రీలంక సిరీస్లో బాధ్యతలు అందుకున్న కపిల్దేవ్, తొలి మ్యాచ్లో భారత జట్టుకి 78 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు.
సచిన్ టెండూల్కర్ 1996లో కెప్టెన్గా తొలిసారి శ్రీలంకపై సిరీస్తోనే మ్యాచులు ఆడాడు. కెప్టెన్గా ఆడిన తొలి మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ టీమ్కి 9 వికెట్ల తేడాతో భారీ పరాజయం ఎదురైంది...
విరాట్ కోహ్లీ కెప్టెన్గా 2013లో తొలిసారిగా శ్రీలంకపై తన మొట్టమొదటి సిరీస్ ఆడాడు. ఈ మ్యాచ్లో భారత జట్టు 161 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది...
రోహిత్ శర్మ 2017లో కెప్టెన్గా లంకపైనే తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంక చేతుల్లో ఓటమి పాలైంది...
కపిల్దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత శ్రీలంకపై కెప్టెన్గా మొట్టమొదటి మ్యాచ్ ఆడనున్నాడు శిఖర్ ధావన్...
శ్రీలంకపై తొలి మ్యాచ్ ఆడిన ఆఖరి ముగ్గురు కెప్టెన్లకు పరాజయం ఎదురుకావడంతో శిఖర్ ధావన్ ఏం చేస్తాడోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు...
షెడ్యూల్ ప్రకారం జూలై 13న ప్రారంభం కావాల్సిన ఇండియా, శ్రీలంక సిరీస్, కరోనా కేసుల కారణంగా జూలై 18కి వాయిదా పడిన విషయం తెలిసిందే...