RCBvsKXIP: పంజాబ్ కష్టాలు తీరతాయా... కోహ్లీ సేన పగ తీర్చుకుంటుందా?
IPL 2020 సీజన్లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి దక్కిన ఏకైక విజయం బెంగళూరుపైనే...
బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య ఇప్పటిదాకా 25 మ్యాచ్లు జరగగా, 12 మ్యాచుల్లో ఆర్సీబీ, 13 మ్యాచుల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది.
సీజన్లో జరిగిన మొదటి మ్యాచ్లో కెఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్...
లక్ష్యచేధనలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 109 పరుగులకే ఆలౌట్ అయ్యి, 97 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది..
7 మ్యాచుల్లో 6 పరాజయాలు అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, దాదాపు ఫ్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది...
గెలవాల్సిన మ్యాచుల్లో కూడా చేజేతులా ఓడింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్- మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ మధ్య ఆసక్తికర పోరు సాగనుంది...
ఈ సీజన్లో ఇప్పటిదాకా బరిలో దిగిన క్రిస్ గేల్, నేటి మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది...