వాళ్లిద్దరికే కాదు, నాకు టీమిండియాలో ప్లేస్ రాకపోవడానికి కూడా అతనే కారణం... అక్షర్ పటేల్ కామెంట్...
ఆరంగ్రేటం టెస్టులోనే అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు లెగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 3 టెస్టుల్లో 27 వికెట్లు తీసి, ఆరంగ్రేటం సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు అక్షర్ పటేల్.
ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అత్యుత్తమ పర్ఫామెన్స్ ఇచ్చిన అక్షర్ పటేల్, టీమిండియా టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకోవడంతో అక్షర్ పటేల్, తుదిజట్టులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.
‘నా పర్ఫామెన్స్, టాలెంట్పై నాకెప్పుడూ డౌట్స్ లేవు. ఆరేళ్ల క్రితమే నేను జట్టులోకి వచ్చినా, బ్యాడ్లక్ వల్ల గాయాలు వెంటాడాయి. అదే టైమ్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.
ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్తో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఏ జట్టుకైనా లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ దొరకడం చాలా అదృష్టం.
జడ్డూ రూపంలో భారత జట్టుకి అలాంటి పర్ఫెక్ట్ ఆల్రౌండర్ దొరికాడు. అందుకే నాకు జట్టులో చోటు దక్కడం చాలా కష్టమైంది. అదీకాకుండా కుల్దీప్ కొన్నాళ్లు, యజ్వేంద్ర చాహాల్ ఇంకొన్నాళ్లు జట్టులో పర్మినెంట్ ప్లేస్ దక్కించుకున్నారు...
టీమ్లో ప్రతీ ప్లేస్కి పర్ఫెక్ట్గా కొందరు ప్లేయర్లు ఫిక్స్ అయిపోవడంతో ఎంట్రీ కోసం చాలా ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆసీస్ టూర్లో రవీంద్ర జడేజా గాయపడడంతో వచ్చిన అవకాశాన్ని, నన్ను నేను నిరూపించుకోవడానికి వాడుకున్నా’ అంటూ తెలిపాడు అక్షర్ పటేల్.
‘రిషబ్ పంత్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడే సమయంలోనే రిషబ్ పంత్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అతని వికెట్ కీపింగ్లో బౌలింగ్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తాను...
టెస్టుల్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినప్పుడు, రిషబ్ పంత్ బౌలర్లను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. అతను వికెట్ల వెనకాల నుంచి చేసే కామెంటరీని బాగా ఎంజాయ్ చేస్తాను...
ఇంగ్లాండ్ సిరీస్లో నేను ఇచ్చిన పర్ఫామెన్స్, నాకు సంతృప్తినిచ్చింది. నేను వేసే బాల్ ఎటు వస్తుందో అర్థం చేసుకునేందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. అందుకే వికెట్లు తీయగలిగాను...
అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ స్పిన్నర్ల నుంచి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు అక్షర్ పటేల్.
ఆస్ట్రేలియా టూర్లో రవీంద్ర జడేజా చేతికి గాయం కావడంతో అతను ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. జడేజా స్థానంలో మొదటి టెస్టులో షాబజ్ నదీం జట్టులో రాగా, రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్లో తొలి ఇన్నింగ్స్లో ఆరు, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు.