MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పాకిస్తాన్ మెరుగైన జట్టే కావొచ్చు.. కానీ ఫీల్డ్‌లో మాత్రం.. భారత్-పాక్ మ్యాచ్‌పై చాహల్ షాకింగ్ కామెంట్స్

పాకిస్తాన్ మెరుగైన జట్టే కావొచ్చు.. కానీ ఫీల్డ్‌లో మాత్రం.. భారత్-పాక్ మ్యాచ్‌పై చాహల్ షాకింగ్ కామెంట్స్

INDIA vs PAKISTAN: దాయాదుల మధ్య పోరు కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనేది అందరికీ తెలిసిందే.  భారత్-పాక్ మధ్య  టీ20  ప్రపంచకప్ సమరం ఈనెల 23న జరుగనున్నది. 

2 Min read
Author : Srinivas M
| Updated : Oct 11 2022, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ పై ఘనమైన రికార్డు కలిగిన భారత జట్టుకు గతేడాది భారీ షాక్ తాకింది. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను పది వికెట్ల తేడాతో ఓడించింది.  ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో భారత్-పాక్  లు రెండుసార్లు తలపడగా చెరోసారి గెలుపు రుచిచూశాయి. 

26

మరో 12 రోజుల్లో ఈ రెండు జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా  బిగ్ ఫైట్ జరుగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ లు మరోసారి ఢీకొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. 

36

దైనిక్ జాగరణ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్న చాహల్ మాట్లాడుతూ.. ‘మీరు ఇప్పటికే ఒక ప్రత్యర్థితో చాలా మ్యాచ్ లు ఆడినందువల్ల  రాబోయే మ్యాచ్ లో వాళ్లను ఎదుర్కోవడం గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. 

46

అయితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సాధారణంగా ఉండే హైప్  ఐసీసీ టోర్నీలలో అధికంగా ఉంటుంది.   దానికి మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్ కారణాలు కావొచ్చు. కానీ  మా క్రికెటర్లకు అది కూడా మిగతా జట్లతో ఆడినట్టుగా అది కూడా ఒక మ్యాచ్ మాత్రమే. అంతకుమించి ఎక్కువ ఆలోచిస్తే మ్యాచ్ లో ఒత్తిడి పెరుగుతుంది. 

56

నేను  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను. కానీ దాయాదుల మధ్య పోరు గురించి ఇతరులు ఏం రాస్తున్నారని.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేదానిమీద నేను పట్టించుకోను.  జట్టుగా పాకిస్తాన్ మెరుగైన టీమ్ కావచ్చు.  కానీ మ్యాచ్ రోజు పరిస్థితులకు అనుకూలంగా ఎవరు నాణ్యమైన క్రికెట్ ఆడతారో వాళ్లే విజేతలవుతారు. అంతా దానిమీదే ఆధారపడి ఉంటుంది...’ అని తెలిపాడు. 

66

టీ20  ప్రపంచకప్ లో భాగంగా ఇరు జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో ఈనెల 23న  తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. సుమారు 80 వేల మంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను లైవ్ ద్వారా వీక్షించే అవకాశముంది.
 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
Recommended image2
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
Recommended image3
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved