శుబ్మన్ గిల్ కాదు, అతనితో ఓపెనింగ్ చేయించాలి... లేదా ఓపెనర్ని ఆ పద్ధతిలో డిసైడ్ చేయండి...
ప్రస్తుత క్రికెట్లో రిజర్వు బెంచ్లో ముగ్గురు ఓపెనర్లు రెఢీగా ఉన్న టీమ్ బహుశా టీమిండియా ఒకటేనేమో. రోహిత్ శర్మతో పాటు శుబ్మన్ గిల్ను ఓపెనింగ్ చేయించాలని గత ఆస్ట్రేలియా పర్యటనలో నిర్ణయించుకుంది టీమిండియా. అయితే గత 8 ఇన్నింగ్స్ల్లో నాలుగుసార్లు ఈ జోడీ 50+ భాగస్వామ్యం నెలకొల్పింది కూడా...
గత ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా తరుపున ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ అద్భుతంగా రాణించడంతో ఇప్పుడు మరోసారి అతన్ని ఆడించాలా? శుబ్మన్ గిల్ని ఆడించాలా? అనే ప్రశ్న ఎదురవుతోంది...
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 28 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, రెండో ఇన్నింగ్స్లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్మన్ గిల్-రోహిత్ జోడీ, రెండో ఇన్నింగ్స్లో 24 పరుగులే చేయగలిగింది...
శుబ్మన్ గిల్ గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులు చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత అతని నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఒక్కటి కూడా రాలేదు. స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ టూర్లో అతను ఘోరంగా ఫెయిల్ అయ్యాడు...
మయాంక్ అగర్వాల్, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీలో 857 పరుగులు చేసి... టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్మెన్గా ఉన్నాడు. అజింకా రహానే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే మయాంక్ అగర్వాల్ కంటే ఎక్కువ పరుగులు చేయగలిగారు.
గత రెండేళ్లలో మూడు సెంచరీలు చేసిన మయాంక్ అగర్వాల్, వాటిల్లో రెండింటిని డబుల్ సెంచరీలుగా మలచగలిగాడు. ప్రతీ నాలుగు టెస్టు ఇన్నింగ్స్లకి ఓసారి 50+ స్కోరు సాధిస్తూ వస్తున్నాడు మయాంక్...
‘మయాంక్ అగర్వాల్ ఓపెనర్గా నిరూపించుకున్నాడు. రెండు సార్లు డబుల్ సెంచరీ కూడా చేశాడు. శుబ్మన్ గిల్ ఫుట్వర్క్ సరిగా లేదు. అవుట్ స్వింగర్ వేస్తే అతను ముందువెళ్లి ఆడాలని చూసి అవుట్ అవుతున్నాడు...
ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో కూడా శుబ్మన్ గిల్ పరుగులు సాధించడానికి బాగా ఇబ్బందిపడ్డాడు. బ్యాక్ ఫూట్ మీద షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
శుబ్మన్ గిల్లో చాలా టాలెంట్ ఉంది. అయితే అతను ఓపెనర్గా సెటిల్ అవ్వాలంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్లను సరిచేసుకోవాల్సి ఉంటుంది...
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి ముందు కౌంటీ జట్లతో కలిసి ప్రాక్టీస్ మ్యాచులు ఆడేందుకు బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రయత్నాలు చేస్తున్నాడు. వీటిని ఓపెనర్ని డిసైడ్ చేసేందుకు వాడుకుంటే మంచిది...
ప్రాక్టీస్ మ్యాచుల్లో శుబ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ ఇద్దరితో కలిసి ఓపెనింగ్ చేయించాలి. వారి పర్ఫామెన్స్ ఆధారంగా టెస్టు సిరీస్లో ఎవరిని ఓపెనింగ్ పంపించాలో నిర్ణయించాలి...
రోహిత్ శర్మ ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాడు. అతను ఓపెనర్గా ఉండడం తప్పనిసరి కాబట్టి ప్రాక్టీస్ మ్యాచులకు అతనికి రెస్ట్ ఇస్తే బెటర్. ఇంగ్లాండ్ కండీషన్స్ను అర్థం చేసుకునేందుకు ఈ మ్యాచులు బాగా ఉపయోగపడతాయి’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడబోతోంది టీమిండియా. దీనికి దాదాపు 40 రోజుల సమయం ఉండడంతో ఇందులో 20 రోజులు హాలీడేస్ ఎంజాయ్ చేయబోతున్నారు భారత క్రికెటర్లు.
ఆ తర్వాత 20 రోజుల పాటు ప్రాక్టీస్లో పాల్గొంటారు. ఈ సమయంలో ఇంగ్లాండ్ కౌంటీ జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది...