దుబాయ్ నుంచి వచ్చే ముందు... రోహిత్ శర్మ ఎమోషనల్ మెసేజ్... ఏమన్నాడంటే
2020 సీజన్ రోహిత్ శర్మకు బాగా కలిసొచ్చింది. వ్యక్తిగతంగా బ్యాటింగ్లో పెద్దగా రాణించకపోయినా, జట్టు సమిష్టిగా మెరవడంతో ముంబై ఇండియన్స్కి వరుసగా రెండో టైటిల్ అందించి రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్. మొత్తంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ... దుబాయ్ నుంచి స్వదేశం బయలుదేరేముందు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు...
మేము యూఏఈలో అడుగుపెట్టినప్పుడు ‘బబుల్ లైఫ్’ ట్రెండ్ అవుతోంది...
మూడు నెలల తర్వాత ఇప్పుడు ఇది చాలా ప్రత్యేకమైన ఐపీఎల్ సీజన్ అని నేను చెప్పగలను...
క్వారంటైన్ పీరియడ్, ఆ తర్వాత ట్రైయినింగ్... ఆ తర్వాత డ్రీమ్11 ఐపీఎల్ 2020... అన్నీ విజయవంతంగా ముగిశాయి...
ప్రోటోకాల్స్ అలవాట్లుగా మారిపోయాయి. టీమ్ రూమ్స్ మా లివింగ్ రూమ్స్గా మారిపోయాయి...
మాకు ఇచ్చిన హోటళ్లు పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్లుగా మారిపోయాయి. డిన్నర్ తర్వాత కలిసి మాట్లాడుకునే చర్చలు కాంపిటీటివ్ గేమింగ్ సెషన్లుగా మారాయి.
టైటిల్ గెలిచి, నిలుపుకోవడం ఎప్పటికీ మాకు ప్రత్యేకమే... మా ‘వన్ ఫ్యామిలీ’ ఇంటికి దూరంగా బయోబబుల్లో మరో ఇంటిని కనిపెట్టింది...’ అంటూ సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చిన రోహిత్ శర్మ, తన టీమ్ ముంబై ఇండియన్స్ను ట్యాగ్ చేశాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మ... మోకాళ్ల దగ్గర మచ్చ అలాగే స్పష్టంగా కనిపిస్తోంది...
రోహిత్ శర్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఫిజియో చెప్పినా, ముంబై ఇండియన్స్ ఆడిన ఆఖరి మూడు మ్యాచుల్లో పాల్గొన్నాడు రోహిత్ శర్మ...
తొలి రెండు మ్యాచుల్లో కలిసి 4 పరుగులే చేసిన రోహిత్ శర్మ... ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 68 పరుగులు చేసి అదరగొట్టాడు...
రోహిత్ శర్మ గాయం మానడానికి సమయం పడుతుందని అభిప్రాయపడిన ఫిజియో, ఆసీస్తో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు అతనికి రెస్టు ఇచ్చిన విషయం తెలిసిందే.