ఐపీఎల్ విజయాన్ని కొడుక్కి అంకితమిచ్చిన హార్ధిక్ పాండ్యా... అలా పట్టుకుని...
IPL 2020 సీజన్ ద్వారా తన రీఎంట్రీని గ్రాండ్గా ఆరంభించాడు భారత ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా. వెన్నెముక ఆపరేషన్ తర్వాత పెద్దగా క్రికెట్ ఆడని ఈ భారత ఆల్రౌండర్... ఐపీఎల్లో భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ చేసింది తక్కువ మ్యాచులే అయినా 25 సిక్సర్లతో అదరగొట్టాడు హార్ధిక్.
ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఈ విజయాన్ని తన కొడకు అగస్త్యకి అంకితమిచ్చాడు ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా...
ఐపీఎల్ ట్రోఫీని కొడుకుని పట్టుకున్నట్టుగా పట్టుకుని ముద్దాడుతూ ఫోజు ఇచ్చిన హార్ధిక్ పాండ్యా... ‘అగస్త్య... ఇది నీ కోసమే’ అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ఏడాది జనవరిలో సెర్బియన్ నటి నటాశాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు హార్ధిక్ పాండ్యా. వీరికి జూన్లో కొడుకు జన్మించాడు. పెళ్లి అయ్యిందా లేదా అనేది మాత్రం తెలియరాలేదు.
కొడుకుని వదిలేసి రావడం చాలా కష్టంగా ఉందని చెప్పిన హార్ధిక్ పాండ్యా, వీకెండ్ పార్టీల కంటే ఎక్కువ అగస్త్యకి డైపర్లు మార్చడం బాగా మిస్ అవుతున్నానంటూ కామెంట్ చేశాడు.
హార్ధిక్ పాండ్యా క్రికెట్ ఆడుతున్న సమయంలో అగస్త్య టీవీ చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది నటాశా.
14 మ్యాచుల్లో 178.98 స్ట్రైయిక్ రేటుతో 281 పరుగులు చేశాడు హార్ధిక్ పాండ్యా... ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మొదటి క్వాలిఫైయర్లో రోహిత్ శర్మ డకౌట్ అయినా పాండ్యా మెరుపులతో 200 పరుగుల స్కోరు చేయగలిగింది ముంబై.
గత సీజన్లో టైటిల్ గెలిచిన అనంతరం ట్రోఫీతో కలిసి ఫోజులిచ్చారు హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బ్రదర్స్... ఈసారి కృనాల్ భార్య కూడా వీరి మధ్యలోకి వచ్చింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో రికార్డు స్థాయిలో ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్... చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుసగా రెండు సీజన్లలో టైటిల్స్ సాధించిన జట్టుగా నిలిచింది.
27 వికెట్లతో ముంబై జట్టులో హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు భారత పేసర్ బుమ్రా. బుమ్రాకి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన సీజన్ మొదటి మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా రాకపోవడం విశేషం.
ముంబై తరుపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు అన్క్యాప్డ్ ప్లేయర్ ఇషాన్ కిషన్. మోస్ట్ సిక్సర్స్ అవార్డు కూడా గెలుచుకున్నాడు కిషన్.