MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియాకు మరో క్రికెటర్‌ దూరం... రంజీ ట్రోఫీలో రికార్డు పరుగులు చేసినా సెలక్టర్లు పట్టించుకోకపోవడంతో...

టీమిండియాకు మరో క్రికెటర్‌ దూరం... రంజీ ట్రోఫీలో రికార్డు పరుగులు చేసినా సెలక్టర్లు పట్టించుకోకపోవడంతో...

టీమిండియాలో వలసలు పెరుగుతున్నాయి. ఎన్నేళ్లు ఎదురుచూసినా అటు ఐపీఎల్‌లో, ఇటు భారత జట్టులో చోటు దక్కక... అవకాశాల కోసం అమెరికాకు వలసెళ్లిపోతున్నారు భారత క్రికెటర్లు. తొలుత స్మిత్ పటేల్, ఆ తర్వాత ఉన్ముక్త్ చంద్, మనన్ శర్మ ... ఇప్పుడీ జాబితాలో మిలింద్ కుమార్ కూడా చేరాడు. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 24 2021, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల బ్యాట్స్‌మెన్ మిలింద్ కుమార్... భారత క్రికెట్ నుంచి వైదొలిగి, అమెరికాకు చెందిన మైనర్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘అవును, నేను ఇండియా తరుపున క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికే బీసీసీఐ అధికారులకు ఈ విషయాన్ని తెలియచేశాను. ఢిల్లీ జట్టు తరుపున విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ వంటి ఎందరో గొప్ప క్రికెటర్లతో ఆడడాన్ని నా దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా... అయితే ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం వైదొలగాల్సి వస్తోంది...’ అంటూ తెలిపాడు మిలింద్ కుమార్.

37

దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, సిక్కిం, త్రిపుర జట్ల తరుపున మ్యాచులు ఆడిన మిలింద్ కుమార్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డేవిల్స్ తరుపున ఆడాడు. ఢిల్లీ జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మిలింద్ కుమార్,  ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 85 బంతుల్లో 78 పరుగులు చేసి అందరిదృష్టినీ ఆకర్షించాడు...

47

2017లో బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరుపున న్యూజిలాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన మిలింద్ కుమార్, రంజీ ట్రోఫీలో ఒకే సీజన్‌లో 121 యావరేజ్‌తో 8 మ్యాచుల్లో 1331 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

57

రంజీ ట్రోఫీలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా శ్రేయాస్ అయ్యర్ రికార్డు బ్రేక్ చేసిన తర్వాత కూడా మిలింద్ కుమార్‌కి టీమిండియా నుంచి పిలుపు రాకపోవడం విశేషం. మిలింద్‌ను సెలక్టర్లు ఏమాత్రం పట్టించుకోలేదు...

67

2013 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌కి, 2019 సీజన్‌లో ఆర్‌సీబీ రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి మిలింద్ కుమార్‌ను కొనుగోలు చేసినా, ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు...

77

ఓవరాల్‌గా 46 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 2988 పరుగులు, 65 లిస్టు ఏ మ్యాచుల్లో 2023 పరుగులు, 58 టీ20ల్లో 1176 పరుగులు చేసిన మిలింద్ కుమార్... మొత్తంగా 10 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు చేశాడు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved