MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పాక్‌కి వెళ్లాలంటే భయపడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఇమ్రాన్ ఖాన్‌పై దాడితో మళ్లీ పాత పరిస్థితులు...

పాక్‌కి వెళ్లాలంటే భయపడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఇమ్రాన్ ఖాన్‌పై దాడితో మళ్లీ పాత పరిస్థితులు...

పాకిస్తాన్‌లో మళ్లీ పాత పరిస్థితులే రాబోతున్నాయా? పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన ఉగ్రదాడి... అక్కడ పరిస్థితులు ఇప్పటికీ ఏం మారలేదని నిరూపిస్తున్నాయా? ఈ సంఘటన తర్వాత మళ్లీ పాక్‌లో పర్యటించేందుకు మిగిలిన దేశాలు సాహసిస్తాయా? ఇప్పుడు పొరుగుదేశంలో ఈ విషయం గురించే చర్చ జరుగుతోంది... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 05 2022, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2009లో పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో అజంతా మెండీస్, కుమార సంగర్కర, మహేళ జయవర్థనేతో సహా ఆరుగురు క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు పోలీస్ అధికారులతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

27

తుపాకీ బుల్లెట్ల నుంచి తమని తాము కాపాడుకోవడానికి శ్రీలంక క్రికెటర్లు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు. క్రికెట్ చరిత్రలోనే ఇదో విషాద సంఘటనగా మిగిలిపోయింది. ఈ సంఘటన తర్వాత ఉగ్రవాదులకు స్థావరంగా మారిన పాక్‌లో పర్యటించేందుకు ఏ జట్టూ సాహసించలేదు..

37
PAK vs NZ

PAK vs NZ

దాదాపు దశాబ్దానికి పైగా తటస్థ వేదికపై యూఏఈలో మ్యాచులు నిర్వహిస్తూ వచ్చింది పాకిస్తాన్. మెల్లిమెల్లిగా పరిస్థితులు సద్ధుమణిగి ఆఫ్ఘాన్, జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్ వంటి చిన్న చిన్న జట్లు... పాక్‌లో క్రికెట్ ఆడడం మొదలెట్టాయి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ ముందు కూడా పాక్‌ పర్యటనకి వెళ్లిన న్యూజిలాండ్, సిరీస్ ఆరంభానికి ముందు భద్రతా కారణాలతో వెనక్కి వచ్చేసింది...

47

ఇంగ్లాండ్ కూడా పాకిస్తాన్‌లో ఆడాల్సిన సిరీస్‌ని రద్దు చేసుకుంది. అయితే ఈ ఏడాది పరిస్థితి కాస్త మెరుగు కావడంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు పాక్‌లో అడుగుపెట్టాయి. సిరీస్‌లు ఆడాయి. దాదాపు 15-20 ఏళ్ల తర్వాత పాక్‌లో అడుగుపెట్టాయి ఈ దేశాలు...

57

పరిస్థఇతి కుదురుకుంటుందని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ సంతోషపడుతున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన ఉగ్రదాడి, అంతా తలకిందులు చేసేసింది... ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌లో పర్యటించేందుకు కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు భయపడుతున్నారు...

67
imran khan

imran khan

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు, పాక్‌లో పర్యటించాల్సి ఉంది. డిసెంబర్ 1 నుంచి 21 వరకూ మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్, పాక్‌లో అడుగుపెట్టాలంటే భయమేస్తోందని కామెంట్ చేశాడు...

77

ఇంగ్లాండ్ తర్వాత న్యూజిలాండ్ కూడా పాక్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్లు పాకిస్తాన్‌లో అడుగుపెడతాయా అనేది అనుమానమే...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Shami : షమీ రిటైర్మెంట్? షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ పేసర్
Recommended image2
Jadeja: జడ్జూ.. ఏంటీ కసి? సీఎస్‌కే వికెట్ తీసి గన్‌తో కాల్చినంత పని చేసిన జడేజా
Recommended image3
RR vs CSK : ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved