ఇది ధోనీ ఫ్యాన్ ఇళ్లు... ఇళ్లంతా పసుపు మయం చేసిన అభిమాని...
IPL 2020: మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ప్రపంచంలో ఎనలేని రికార్డులెన్నో క్రియేట్ చేశాడు. భారత జట్టుకు రెండు ప్రపంచకప్లు అందించిన ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ధోనీ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు...
బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్న ధోనీ, జట్టులో విజయాలవైపు నడిపించలేకపోతున్నాడు...
దీంతో మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరుపై, కెప్టెన్సీపై అనేక విమర్శలు వస్తున్నాయి...
దీనికి సమాధానంగా ఓ అభిమాని... తన ఇంటిని మొత్తం మార్చేశాడు...
తమిళనాడుకి చెందిన ధోనీ వీరాభిమాని గోపి కృష్ణన్, తన ఇంటికి పూర్తిగా సీఎస్కే కలరింగ్ ఇచ్చేశాడు...
కడలూర్ ఏరియాలోని అరంగూర్కి చెందిన ధోనీ... ‘ఇది ధోనీ అభిమాని ఇళ్లు’ అని రాసుకున్నాడు...
ఇంటి గోడలపై ధోనీ ఫోటోలతో నింపేసి... చెన్నై సూపర్ కింగ్స్ కవరింగ్ ఇచ్చాడు...
‘విజిల్ పోడు’ అని ఓ వైపు రాసి... చెన్నై సూపర్ కింగ్స్ లోగోని కూడా డిజైన్ చేశాడు...
ధోనీని విమర్శించేవారిపై ఫైర్ అయిన గోపి కృష్ణన్, భారత జట్టుకు ఎంతో సేవ చేసిన మాహీని ఇలా నిందించడం సిగ్గుచేటు అని అన్నాడు...
కష్టకాలంలో మహేంద్ర సింగ్ ధోనీకి అండగా ఉన్నవారే అసలైన అభిమానులని అన్నాడు గోపికృష్ణన్.