బంగారు హుండీని చిల్లర కోసం వాడుకుంటున్నారు... కేకేఆర్పై ఆకాశ్ చోప్రా కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్లో మొట్టమొదటి మ్యాచ్లో ఘన విజయం అందుకున్న కోల్కత్తా నైట్రైడర్స్, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్కి అనుకూలిస్తున్న పిచ్పై 133 పరుగులే చేయగలింది...
ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్ఆర్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్కి ముందు రాయల్స్పై తిరుగులేని ఆధిపత్యంలో ఉంది కోల్కత్తా నైట్రైడర్స్. గత 7 మ్యాచుల్లో ఆరు మ్యాచుల్లో రాజస్థాన్ను ఓడించింది కోల్కత్తా నైట్రైడర్స్..
‘కోల్కత్తా నైట్రైడర్స్ ఓటమికి ఆ జట్టు చేసిన కొన్ని వ్యూహాత్మక లోపాలే కారణం... గత మ్యాచ్లో 10.2 ఓవర్ల తర్వాత వికెట్ పడితే ఏం జరిగిందో చూశాం. ఆండ్రే రస్సెల్ క్రీజులోకి వచ్చి బౌలర్లకు చుక్కలు చూపించాడు...
అలాంటి ఫామ్లో ఉన్న ఆండ్రే రస్సెల్ను ఎలా ఉపయోగించుకోవాలో కెప్టెన్కి తెలిసి ఉండాలి. పవర్ ప్లేలో పెద్దగా పరుగులు రాలేదు. శుబ్మన్ గిల్ స్లోగా బ్యాటింగ్ చేసి రనౌట్ అయ్యాడు.
నితీశ్ రాణా కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. పవర్ ప్లేలో జట్టుకి అవసరమైన పరుగులు పెద్దగా రానప్పుడు, భారీ హిట్టర్కి ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం ఇవ్వాలి...
వేగంగా పరుగులు సాధించే బ్యాట్స్మెన్కి బ్యాటింగ్ లైనప్లో ముందు పంపిస్తే, బౌలర్లపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. కానీ కోల్కత్తా నైట్రైడర్స్ అలా ఆలోచించలేదు...
కోల్కత్తా నైట్రైడర్స్ దగ్గర ఓ బజుకా లాంటి ప్లేయర్ ఉన్నాడు. కానీ అతన్ని ఎలా వాడుకోవాలో జట్టుకి సరిగా తెలియడం లేదు... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...
సునీల్ నరైన్ అవుటైన తర్వాత ఆండ్రే రస్సెల్ను పంపించి ఉంటే, అతనికి ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం దొరికి ఉండేదని, దాని వల్ల కోల్కత్తా నైట్రైడర్స్ భారీ స్కోరు చేసి ఉండేదని అభిప్రాయపడ్డాడు ఆకాశ్ చోప్రా...
కేకేఆర్ విధించిన 133 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ చేధించిన రాజస్థాన్ రాయల్స్ సీజన్లో రెండో విజయాన్ని అందుకుంది. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ 41 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.