అతన్ని చూస్తే లెస్బియన్లా అనిపించాడు... 11 ఏళ్ల క్రిందటి జేమ్స్ అండర్సన్ ట్వీట్ వైరల్...
ఇంగ్లాండ్ క్రికెటర్ ఓల్లీ రాబిన్సన్ 8 ఏళ్ల క్రితం వేసిన రేసిజం, సెక్సిస్టు ట్వీట్ల కారణంగా మొదటి మ్యాచ్ తర్వాత నిషేధానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ జట్టులోని క్రికెటర్ల పాత ట్వీట్లపై కూడా ఓ లుక్ వేస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఈసీబీ కంటే ముందు అభిమానులు, క్రికెటర్ల పాత ట్వీట్లను వెతికి తవ్వుతున్నారు...
ఇంగ్లాండ్ జట్టులోని ముగ్గురు క్రికెటర్లు, పాత ట్వీట్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనేలా భావిస్తున్నారు. ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్తో పాటు జోస్ బట్లర్, భారతీయులకు వ్యతిరేకంగా కొన్ని రేసిస్టు ట్వీట్లు చేయగా... సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ వేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది.
ఇంగ్లాండ్ జట్టు తరుపున 161 టెస్టులు ఆడిన జేమ్స్ అండర్సన్, ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్నవారిలో సీనియర్ మోస్ట్ ప్లేయర్. అతని సహచరుడు స్టువర్ట్ బ్రాడ్ 147 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు.
స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి వచ్చిన కొత్తలో 2010లో జేమ్స్ అండర్సన్ వేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ‘బ్రాడీ కొత్త హెయిర్కట్ను ఇప్పుడే చూశా. దాని గురించి క్లియర్గా చెప్పలేను కానీ అతను అచ్చు ఓ 15 ఏళ్ల లెస్బియన్లాగా కనిపించాడు... ’ అంటూ 2010, ఫిబ్రవరి 20న ట్వీట్ చేశాడు జేమ్స్ అండర్సన్.
క్లోజ్ ఫ్రెండ్ అయిన స్టువర్ట్ బ్రాడ్ను లెస్బియన్లా కనిపించానడంలో పెద్దగా జాతి వివక్ష, వివాదాస్పదకరంగా ఏమీ లేకపోయినా... 15 ఏళ్ల టీనేజ్ లెస్బియన్ అనడంతో అతని ట్వీట్లో పిల్లల పట్ల చులకనభావం ఉన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
11 ఏళ్ల క్రితం ట్వీట్, ఇప్పుడు వైరల్గా మారి వివాదం రేగడంతో దాన్ని డిలీట్ చేసిన జేమ్స్ అండర్సన్... ‘అది 11 ఏళ్ల క్రితం నాటి ట్వీట్. నేను అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయాను. నేను మంచోడిననే అనుకుంటున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ టెస్టు టీమ్లో సీనియర్ పేసర్లు ఉన్న స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ కలిసి 100పైగా టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. జేమ్స్ అండర్సన్ విషయం పక్కనబెడితే, ఇంగ్లాండ్ రెడ్ బాల్ క్రికెట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం ఇబ్బందుల్లోపడే అవకాశం కనిపిస్తోంది.
భారత అభిమానుల గురించి ట్రోల్ చేస్తూ, మోర్గాన్, బట్లర్ చేసిన ట్వీట్లను పరిశీలిస్తున్నట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ‘స్టుపిడ్’ అని తిడుతూ స్పిన్నర్ డామ్ బేస్ వేసిన పోస్టుపై తీవ్ర దుమారం రేగింది.
ఓ మ్యాచ్లో బ్యాటు సెలక్ట్ చేసుకుంటున్న ధోనీ ఫోటోను పోస్టు చేసిన డామ్ బేస్... ‘నీకెన్ని బ్యాట్లు కావాలి ధోనీ... 5 ఆ, స్టుపిడ్’ అంటూ వేసిన పోస్టుపై మాహీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే వెంటనే అలర్ట్ అయిన డామ్ బేస్, తన ట్విట్టర్ అకౌంట్ను డిలీట్ చేసేశాడు. అయితే సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించాడు.
అందమైన క్రికెటర్లలో ఒకడిగా గుర్తించబడే స్టువర్ట్ బ్రాడ్ను మొదటిసారి ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుందని, తనకి వెంటనే ప్రపోజ్ చేయాలని అనుకున్నానని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్ క్రికెటర్లలో చాలామంది తాము వేసే పాత ట్వీట్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఆ దేశ యంగ్ ఆల్రౌండర్ సామ్ కుర్రాన్ మాత్రం తన పరీక్షల గురించి ట్వీట్లు చేయడం విశేషం. ఈ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలో తెలియడం లేదంటూ కుట్టీ తలా వేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.