IPL 2020: ధోనీ ప్లాన్ బీ... ఫ్లేఆఫ్స్ చేరతామంటున్న చెన్నై సీఈవో...
IPL 2020 సీజన్ తొలి సగంలో జరిగిన ఏడు మ్యాచుల్లో కేవలం 2 మ్యాచులు మాత్రమే గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గెలిచి మూడో విజయాన్ని అందుకుంది. ధోనీ సేన ఫ్లేఆఫ్ చేరడం కష్టమే అంటున్నా, కచ్ఛితంగా ఫ్లేఆఫ్స్ చేరుతుందని అంటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్.
బౌలింగ్లో బాగానే రాణిస్తున్నా, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం ఘోరంగా ఫెయిల్ అవుతోంది...
స్వల్ప లక్ష్యాలను చేధించడంలో కూడా విఫలమవుతూ ఏడు మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది...
మహేంద్ర సింగ్ భారీ షాట్లు ఆడుతున్నా, భారీ ఇన్నింగ్స్ నిర్మించడంలో విఫలమవుతున్నాడు...
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో భారీ స్కోరు చేయలేకపోయినా, బౌలర్లు రాణించడంతో విజయం దక్కింది.
దీంతో మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్లో ఎవరైనా మంచి బ్యాట్స్మెన్ను జట్టులోకి తీసుకుంటుందని భావించారు అభిమానులు...
అయితే తమకు ఏ క్రికెటర్ వద్దని, ఉన్నవాళ్లతోనే ప్లేఆఫ్ చేరుతుందని చెబుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవవో కాశీ విశ్వనాథన్...
‘ఐపీఎల్ కెరీర్లో ఇప్పటిదాకా మిడ్ సీజన్ బదిలీలో ఏ ఆటగాడిని తీసుకోలేదు... ఈసారి కూడా ఏ క్రికెటర్ను కోరుకోవడం లేదు...
మా ఆటతీరు మరీ అంత ఘోరంగా ఏమీ లేదు... ఫ్లేఆఫ్స్ చేరేందుకు ధోనీ దగ్గర ప్లాన్ బీ ఉంది...’ అని చెప్పాడు విశ్వనాథన్...
మా ఆటతీరు మరీ అంత ఘోరంగా ఏమీ లేదు... ఫ్లేఆఫ్స్ చేరేందుకు ధోనీ దగ్గర ప్లాన్ బీ ఉంది...’ అని చెప్పాడు విశ్వనాథన్...
8 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.