కోహ్లీ, డివిల్లియర్స్ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయండి, కెఎల్ రాహుల్ కామెంట్...
IPL 2020 సీజన్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. అయితే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ను అవుట్ చేయాలని అంటున్నాడు కెఎల్ రాహుల్...
ఇప్పటిదాకా జరిగిన ఏడు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచి, టాప్ 3లో కొనసాగుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
సీజన్లో ఆర్సీబీ దక్కిన రెండు పరాజయాల్లో ఒకటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్పైనే దక్కింది...
మరోవైపు ఆర్సీబీపై దక్కిన ఒకేఒక్క విజయం తప్ప, మరో మ్యాచ్ గెలవలేకపోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
ఏడు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి, ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది...
మిగిలిన ఏడు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా, పంజాబ్ ప్లేఆఫ్ చేరడం దాదాపు అసాధ్యమే...
తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ సరదగా మాట్లాడుకున్నారు...
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్లను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని అంటున్నాడు కెఎల్ రాహుల్...
‘నాకు అవకాశం వస్తే వచ్చే ఏడాది కోహ్లీ, ఏబీడీలను బ్యాన్ చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే మీరిద్దరూ ఇప్పటికే చాలా పరుగులు చేసేశారు...
ఐపీఎల్లో 5 వేల పరుగుల మార్కు చేరుకుంటే చాలు, ఆ తర్వాత వేరేవాళ్లకి అవకాశం ఇవ్వాలి...’ అంటూ కోహ్లీతో సరదాగా సంభాషించాడు కెఎల్ రాహుల్...
100 మీటర్ల కంటే భారీ సిక్స్ కొడితే, ఆరు కంటే ఎక్కువ పరుగులు ఇచ్చే నిబంధన తేవాలని అన్నాడు కెఎల్ రాహుల్...