IPL 2020: ధోనీ సేన 2010 హిస్టరీని రిపీట్ చేస్తుందా... ఫ్యాన్స్లో సంతోషం...
2010 సీజన్లో కూడా మొదటి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్...
అయితే ఆ తర్వాత ధోనీ మ్యాజిక్తో టైటిల్ కైవసం చేసుకున్న సీఎస్కే... 2020లో 2010 హిస్టరీని ధోనీ రిపీట్ చేయబోతున్నాడంటున్న ‘తలైవా’ ఫ్యాన్స్...
IPL 2020 సీజన్ 13లో పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్.
ఏడు మ్యాచులు ఆడిన సీఎస్కే కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది.
‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా ఈ సీజన్లో జట్టుకు దూరం కావడంతో బ్యాటింగ్లో ఘోరంగా విఫలమవుతోంది చెన్నై సూపర్ కింగ్స్.
అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు.
దీనికి కారణం 2010లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఇలాంటి ప్రదర్శననే ఇవ్వడం.
2010 సీజన్లో మొదటి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది సీఎస్కే.
అయితే ఆ తర్వాత మంచి కమ్ బ్యాక్ ఇచ్చి ఫ్లే ఆఫ్ చేరింది.
ఫ్లేఆఫ్స్లో కూడా విజయాలతో ఫైనల్ చేరి టైటిల్ కైవసం చేసుకుంది.
అంతేకాదు అదే ఏడాది ఛాంపియన్స్ లీగ్ టైటిల్ కూడా కైవసం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
ఈ సారి కూడా ధోనీ సేన కమ్ బ్యాక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
అయితే 2010లో జట్టులో ఉన్న సురేశ్ రైనా, ఇప్పుడు లేడు.
రైనా లేకుండా చెన్నై మళ్లీ అలాంటి ప్రదర్శన ఇవ్వగలదా? అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా, ఆడిన ప్రతీ సీజన్లోనూ ఫ్లేఆఫ్స్ చేరిన ఏకైక జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్... ఈ సారి ఫ్లేఆఫ్స్ అయినా చేరుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.