MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది, ఎంత ఎగురుతారో ఎగరండి... సౌతాఫ్రికా ప్లేయర్లకి జస్ప్రిత్ బుమ్రా వార్నింగ్...

ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది, ఎంత ఎగురుతారో ఎగరండి... సౌతాఫ్రికా ప్లేయర్లకి జస్ప్రిత్ బుమ్రా వార్నింగ్...

సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. మొదటి టెస్టులో టీమిండియా, రెండో టెస్టులో సౌతాఫ్రికా గెలవడంతో కేప్‌ టౌన్‌లో జరిగే  మూడో టెస్టు సిరీస్ డిసైడర్‌గా మారనుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 08 2022, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇప్పటిదాకా జరిగిన రెండు టెస్టుల్లో సఫారీ బౌలర్లు కగిసో రబాడా 13 వికెట్లు పడగొట్టగా, మార్కో జాన్సెన్ 12 వికెట్లు తీశాడు. లుంగి ఇంగిడికి 11 వికెట్లు దక్కాయి... సఫారీ బౌలర్లతో పోలిస్తే భారత బౌలర్ల నుంచి ఆ స్థాయి పర్ఫామెన్స్ రాలేదు...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

మహ్మద్ షమీ రెండు మ్యాచుల్లో 11 వికెట్లు తీస్తే, శార్దూల్ ఠాకూర్ 10 వికెట్లు తీశాడు. జస్ప్రిత్ బుమ్రాకి ఆరు వికెట్లు మాత్రమే దక్కగా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు తీశారు...

38

జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో కెఎల్ రాహుల్‌తో పాటు జస్ప్రిత్ బుమ్రాని సెడ్జింగ్ చేశారు సౌతాఫ్రికా ప్లేయర్లు. శార్దూల్ ఠాకూర్‌ని కూడా హేళన చేస్తూ, విసిగించారు....

48

హనుమ విహారి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సఫారీ బౌలర్ వేసిన ఓ బంతి, అతనికి బలంగా తాకింది. దీంతో ఫిజియో నితిన్ పటేల్ క్రీజులోకి వచ్చి, చికిత్స అందించాడు...

58

ఈ సమయంలో జస్ప్రిత్ బుమ్రా చేసిన కామెంట్లు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘భయంతో స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది, చూసుకుందాం...

68

ఇప్పుడు ఎంత ఎగురుతారో ఎగరండి, తర్వాతి మ్యాచ్‌లో మేమేంటో చూపిస్తాం... ఇప్పుడు ఎవరెవరు వింటున్నారో వినండి...’ అంటూ వ్యాఖ్యలు చేశాడు జస్ప్రిత్ బుమ్రా...

78

జనవరి 11న కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే టెస్టు సిరీస్ వశమవుతుంది...

88

గాయం కారణంగా రెండో టెస్టులో బరిలో దిగని టెస్టు సారథి విరాట్ కోహ్లీ, మూడో టెస్టులో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విరాట్ కోహ్లీ కోసం తుదిజట్టులో ఎవరు తమ స్థానాన్ని త్యాగం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
Recommended image2
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image3
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved