ఆ నాలుగూ తప్ప, మిగిలిన అన్ని ప్లేస్లపై సస్పెన్సే... మొదటి వన్డేలో భారత జట్టు...
కరోనా వైరస్ కారణంగా ఏడాది వాయిదా పడి, లంక టీమ్లో కరోనా కేసుల కారణంగా షెడ్యూల్కి మరో ఐదురోజులు ముందుకు జరిగిన శ్రీలంక, ఇండియా వన్డే సిరీస్ ఎట్టకేలకు జూలై 18న ప్రారంభం కానుంది. అయితే ఆరుగురు కొత్త ప్లేయర్లతో కూడిన భారత జట్టులో తుదిజట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఓపెనర్గా, లంక టూర్కి కెప్టెన్గా వ్యవహారిస్తున్న శిఖర్ ధావన్ రావడం పక్కా. తనకి బాగా అచొచ్చిన ఓపెనింగ్ స్థానాన్ని మరో ప్లేయర్ కోసం త్యాగం చేసే సాహసం ‘గబ్బర్’ చేయకపోవచ్చు.
వన్డేల్లో 5977 పరుగులు చేసిన శిఖర్ ధావన్, మరో 23 పరుగులు చేస్తే 6 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఫీట్ అందుకోనున్న 10వ భారత బ్యాట్స్మెన్గా నిలిచే ‘గబ్బర్’, విరాట్ కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా నిలుస్తాడు...
శిఖర్ ధావన్తో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే విషయంలో క్లారిటీ లేకపోయినా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషాకే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. విజయ్ హాజారే ట్రోఫీ, ఐపీఎల్ 2021 సీజన్లో అదరగొడుతున్న పృథ్వీషాతో పాటు దేవ్దత్ పడిక్కల్ కూడా ఈ ప్లేస్ కోసం పోటీపడుతున్నాడు.
దేవ్దత్ పడిక్కల్ కూడా విజయ్ హాజారే ట్రోఫీలో 800లకు పైగా పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఇద్దరే కాకుండా రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా రూపంలో మరో ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు...
వన్డౌన్లో సూర్యకుమార్ యాదవ్ ఆడడం ఖాయం. ఐపీఎల్లో మూడో నెంబర్ బ్యాట్స్మెన్గా మంచి రికార్డు ఉన్న సూర్యకుమార్ యాదవ్కి ప్రస్తుత జట్టులో పెద్దగా పోటీ కూడా లేదు...
నాలుగో స్థానంలో సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్ బ్యాటింగ్కి రావచ్చు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఈ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందనేదాన్ని బట్టి, ఈ ప్లేస్లో ఎవరొస్తారనేది డిసైడ్ అవుతుంది... వీరిద్దరి బదలుగా సీనియర్ బ్యాట్స్మెన్ మనీశ్ పాండే కూడా అందుబాటులో ఉన్నాడు.
ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చేందుకు కూడా కృనాల్ పాండ్యా, తన తమ్ముడు హార్ధిక్ పాండ్యాతో పోటీపడబోతున్నాడు. అయితే స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా తుదిజట్టులో చోటు దక్కించుకోవడం పక్కా అయితే అన్న కృనాల్ ప్లేస్పై గ్యారెంటీ లేదు.
లంక టూర్కి ఎంపిక చేసిన ప్లేయర్లలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకి పెద్దగా పోటీ లేదు. కాబట్టి ఓపెనర్లుగా ఎంపికైన వారిలో ఒకరిని మిడిల్ ఆర్డర్లో ఆడించే అవకాశం ఉంది.
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ప్రస్తుత టూర్కి వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ప్రధాన పేసర్గా తుదిజట్టులో భువీ ఉండడం కూడా గ్యారెంటీ...
దీపక్ చాహార్తో పాటు నవ్దీప్ సైనీ, చేతన్ సకారియాలలో ఇద్దరు భువీతో పేస్ బౌలింగ్ చేసే అవకాశం వస్తుంది. అలాగే స్పిన్ బౌలింగ్ విషయంలోనూ పోటీ బాగానే ఉంది.
సీనియర్లు యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్లతో పాటు కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహార్, వరుణ్ చక్రవర్తి తుది జట్టులో చోటు కోసం పోటీపడాల్సి ఉంది...
ప్రయోగాలకు పెద్దగా అవకాశం ఇవ్వకుండా సీనియర్లు, జూనియర్లతో పటిష్టమైన జట్టుతో బరిలో దిగాలని టీమిండియా భావిస్తే మాత్రం... కొత్త వాళ్లకు అవకాశం రాకపోవచ్చు... అలాంటిప్పుడు తుది జట్టు ఇలా ఉంటుంది.
శిఖర్ ధావన్, పృథ్వీషా ఓపెనర్లుగా, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, మనీశ్ పాండే, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, నవ్దీప్ సైనీ, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్