MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐదు రోజుల టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగిస్తే ఎలా..? బీజేపీ ఎంపీ ఆగ్రహం

ఐదు రోజుల టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగిస్తే ఎలా..? బీజేపీ ఎంపీ ఆగ్రహం

INDvsAUS:  ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  ఇప్పటివరకు మూడు టెస్టులు ముగియగా ఏ ఒక్క మ్యాచ్ కూడా  పూర్తిగా మూడు రోజుల పాటు సాగలేదు. 

2 Min read
Author : Srinivas M
Published : Mar 08 2023, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐదు రోజులు ఆడాల్సిన టెస్టు మ్యాచ్ లు  మూడు రోజులు  కూడా పూర్తిగా ఆడకుండానే రెండున్నర రోజుల్లోనే ముగుస్తుండటంపై  భారత మాజీ ఓపెనర్, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండున్నర రోజులలో టెస్టు మ్యాచ్ లు ముగియడం ఆటకు ఏమాత్రం మంచిదికాదని గంభీర్  అన్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులతో పాటు ఇండోర్ టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసింది.  ఈ నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. టెస్టు క్రికెట్ నుంచి  ఫ్యాన్స్ కోరుకునేది ఇది కాదని, ఇలా అయితే ఆటకు ప్రమాదమని హెచ్చరించాడు. 

36

స్టోర్ట్స్ టుడేతో గంభీర్ మాట్లాడుతూ... ‘టర్నింగ్ పిచ్ (స్పిన్ ను అనుకూలించేవి) లు మంచివే. పిచ్ లను నేనేమీ నిందించడం లేదు. కానీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియడం ఏమాత్రం మంచిది కాదు. అభిమానులు  ఇటీవల న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరిగినట్టుగా ఉత్కంఠగా టెస్టు జరగాలని కోరుకుంటున్నారు. 

46

ఒక టెస్టు  నాలుగు లేదా ఐదు రోజులు ఆడితేనే దానికి అందం.  కానీ మరీ రెండున్నర రోజులకే ముగియడం  మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు...’అని గంభీర్ చెప్పాడు.  ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ నడుమ  జరిగిన రెండో టెస్ట్ లో  ఐదో రోజు చివరి సెషన్ లో విజేత తేలడం గమనార్హం. ఒక్క పరుగు తేడాతో కివీస్ విజయం సాధించింది.  

56

ఇక  ఆధునిక క్రికెట్ లో  డీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తున్నదని   గంభీర్ అన్నాడు. గతంలో డీఆర్ఎస్ అందుబాటులో లేనప్పుడు బ్యాటర్లు వాళ్ల టెక్నిక్ మీద దృష్టిపెట్టేవాళ్లని, కానీ  ఇప్పుడు  దాని గురించి మాట్లాడేవారే కరువయ్యారని అన్నాడు. 

66

టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ,  ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మలు  స్పిన్ ఆడటంలో దిట్ట అని లేకుంటే వాళ్లు ఇంతకాలం ఎలా ఆడగలరని గంభీర్ ప్రశ్నించాడు.  పుజారా, కోహ్లీలు టెస్టులలో వంద మ్యాచ్ లు ఆడారని.. స్పిన్, పేస్ లను సమర్థంగా ఎదుర్కున్నారు కాబట్టే వాళ్లు  ఇంతకాలం నిలదొక్కుకున్నారని  గంభీర్ చెప్పాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లో భువనేశ్వర్ వరల్డ్ రికార్డ్.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్?
Recommended image2
Team India: సూర్యకు షాక్.. అయ్యర్ కాదు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజూ? సెలక్టర్ల ప్లాన్ ఇదే!
Recommended image3
5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved