పాండ్యాను ఇంటికి పంపకండి... టెస్టు సిరీస్ ఆడించండి... అతను జట్టులో ఉంటే.. - షేన్వార్న్...
ఆస్ట్రేలియాలో వన్డే, టీ20 సిరీస్ల్లో అదరగొట్టాడు భారత ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా. వన్డే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా నిలిచిన హార్ధిక్ పాండ్యా, టీ20 సిరీస్లోనూ ఫామ్ కంటిన్యూ చేసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు. అవకాశం వస్తే టెస్టు సిరీస్ ఆడతావా? అని మూడో టీ20 అనంతరం వ్యాఖ్యతగా వ్యవహారించిన మాజీ క్రికెటర్ షేన్వార్న్ అడిగిన ప్రశ్నకు... ‘లేదు... నాలుగు నెలలైంది, ఇంటికి వెళ్లిపోతా’నంటూ సమాధానం చెప్పాడు హార్దిక్ పాండ్యా.
ఐపీఎల్ 2020 సీజన్ కోసం నెలన్నర వయసున్న కొడుకు అగస్త్యను వదిలి, యూఏఈ చేరుకున్నాడు హార్ధిక్ పాండ్యా...
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా, ఆ ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా టూర్కి కూడా ఎంపికయ్యాడు...
ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే, టీ20 సిరీస్లో అద్భుతంగా మెరిసిన హార్దిక్ పాండ్యా, టెస్టు సిరీస్లో కూడా ఆడితే టీమిండియాకు బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు ఆసీస్ మాజీ ప్లేయర్ షేన్వార్న్.
‘ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యాను టెస్టు సిరీస్కి కూడా ఎంపిక చేయాల్సింది... తన ఎనర్జీతో మిగిలిన ఆటగాళ్లలో కూడా బూస్ట్ నింపుతాడు హార్దిక్ పాండ్యా...
అతనో సూపర్స్టార్... చక్కని పరిణతి కలిగిన క్రికెటర్. హార్ధిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు నేటి క్రికెట్కి చాలా అవసరం.... టీమిండియాకి అతను కీలక ప్లేయర్.
ఆసీస్తో జరిగిన టీ20, వన్డే సిరీస్ల్లో హార్దిక్ పాండ్యా ఇచ్చిన పర్ఫామెన్స్ చూస్తే, అతను ఎలాంటి ప్లేయరో అర్థం అవుతుంది...
అతన్ని టెస్టులకు ఎంపిక చేసి ఉంటే టీమిండియాకి మంచి విజయాలు అందించేవాడు...’ అని చెప్పుకొచ్చాడు షేన్ వార్న్.
టీ20 సిరీస్ ముగియడంతో వన్డే, టీ20లకు మాత్రమే ఎంపికైన నటరాజన్, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు స్వదేశానికి పయనమవ్వడానికి సిద్ధమవుతున్నారు...
రోహిత్ శర్మ ఆసీస్ టూర్కి వస్తాడా? రాడా? అనే విషయమై ఇంకా క్లారిటీ రాకపోవడంతో శ్రేయాస్ అయ్యర్ను బ్యాక్ అప్ ప్లేయర్గా ఆస్ట్రేలియాలోనే ఉంచుకోవాలని చూస్తోంది బీసీసీఐ..