గేల్ ఈ వయసులో ఆడినప్పుడు ధోనీ, యువరాజ్, భజ్జీ ఆడలేరా... భారత సెలక్టర్లపై ట్రోలింగ్...
‘యూనివర్సల్ బాస్’ క్రిస్గేల్ వయసు ప్రస్తుతం 41 ఏళ్లు. 41 ఏళ్ల వయసులో కూడా జాతీయ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న క్రిస్గేల్, తాజాగా ఆసీస్తో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...
38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేసిన క్రిస్ గేల్, టీ20ల్లో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్గా నిలిచాడు గేల్...
క్రిస్గేల్ 14 వేలకు పైగా పరుగులతో టాప్లో ఉండగా, కిరన్ పోలార్డ్ 10836 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న పోలార్డ్ కంటే 3200+ పరుగులు ఎక్కువగా చేశాడు గేల్...
40+ వయసులో కూడా క్రిస్గేల్కి జట్టులో చోటు కల్పిస్తోంది విండీస్ జట్టు. అదీకాకుండా గత ఐదేళ్లలో క్రిస్గేల్, ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు..
చివరిసారిగా 2016 టీ20 వరల్డ్కప్లో హాఫ్ సెంచరీ చేసిన క్రిస్గేల్, ఐదేళ్ల తర్వాత తిరిగి ఆసీస్తో జరిగిన మూడో వన్డేలోనే 50+ మార్కు అందుకున్నాడు. దీనికి ముందు గత 10 టీ20ల్లో గేల్ చేసింది 117 పరుగులే...
మొదటి రెండు టీ20ల్లో 17 పరుగులే చేసినా మూడో మ్యాచ్లో గేల్కి అవకాశం ఇచ్చిన విండీస్ జట్టు... ‘గేల్ పరుగులు చేసినా చేయకపోయినా అతను క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టులో ఓ భయం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా జట్టుకి విజయాలు అందించిన గేల్, టీమ్లో ఉండడం అవసరం...’ అంటూ తెలిపాడు కిరన్ పోలార్డ్...
41 ఏళ్ల వయసులో క్రిస్ గేల్, జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ, హర్భజన్ సింగ్ వంటి భారత సీనియర్లను ఎందుకు పక్కనబెడుతున్నారంటూ బీసీసీఐ సెలక్టర్లపై విమర్శలు వస్తున్నాయి.
2019 వన్డే వరల్డ్కప్లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత ఏడాదిపాటు ఖాళీగా ఉన్నాడు.... ధోనీ స్థానంలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ... మాహీని ఏ సిరీస్కూ ఎంపిక చేయలేదు...
దాదాపు ఏడాది పాటు జట్టులో చోటు కోసం నిరీక్షించిన మహేంద్ర సింగ్ ధోనీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు అర్ధాంతరంగా ప్రకటించాడు...
ధోనీతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి ఎందరో ప్లేయర్లు వయసు కారణంగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయి, నిరాశగా రిటైర్మెంట్ ప్రకటించవాళ్లే...
ఇప్పుడు ఈ లిస్టులో భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చేరబోతున్నాడు.
41 ఏళ్ల హర్భజన్ సింగ్, చివరిసారిగా 2016లో టీమిండియా తరుపున మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత తిరిగి టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఐదేళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నాడు భజ్జీ...
103 టెస్టుల్లో 417 వికెట్లు తీసి, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో ఒకడిగా నిలిచిన హర్భజన్ సింగ్... ఇలా జట్టులో చోటు కోసం ఎదురుచూడడం అతను టీమిండియాకి అందించిన సేవలను అవమానించడమే అంటున్నారు అభిమానులు.
క్రిస్ గేల్ ఐదేళ్లుగా ఒక్క హాఫ్ సెంచరీ చేయకపోయినా జట్టులో కొనసాగినట్టు, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ లాంటి లెజెండరీ క్రికెటర్లకు కెరీర్ చివర్లో సరైన వీడ్కోలు ఒక్క అవకాశం ఇవ్వలేరా? అంటూ కామెంట్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...