అక్కడ బుమ్రా, ఇక్కడ భువీ... భారత డెత్ ఓవర్ స్పెషలిస్ట్లకి ఏమైంది?...
పదేళ్ల కిందటి భారత జట్టుతో పోలిస్తే, ఇప్పుడు టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. రిజర్వు బెంచ్తో బలంగా కనిపిస్తోంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన ప్రధానమైన తేడా మాత్రం భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగమే... అతని ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్టార్ల పర్ఫామెన్స్ ఆందోళన కలిగిస్తోంది..
స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కలిసి భారత జట్లుకి ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. ఓపెనింగ్ స్పెల్స్ వేయడమే కాకుండా డెత్ ఓవర్ స్పెషలిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్నారు...
భువనేశ్వర్ కుమార్ తన స్పింగ్ బౌలింగ్తో బ్యాట్స్మెన్ను ముప్పు తిప్పలు పెడితే, జస్ప్రిత్ బుమ్రా యార్కర్లతో వికెట్లను గిరాటేసేవాడు... ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ జోడీగా గుర్తింపు పొందారు బుమ్రా, భువీ..
అయితే ఈ మధ్య వారి పర్ఫామెన్స్, టీమిండియా ఫ్యాన్స్ను షాక్కి గురి చేస్తోంది. ఇంగ్లాండ్ టూర్లో ఉన్న స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు...
రెండు ఇన్నింగ్స్ల్లోనూ వికెట్ తీయలేకపోయిన ఒకే ఒక్క బౌలర్గా నిలిచి, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణమయ్యాడు... బుమ్రా ఒక్కడు బుమ్రాలా పర్పామెన్స్ ఇచ్చి ఉంటే, సీన్ వేరేగా ఉండేది.
ఇటు శ్రీలంక టూర్కి వైస్ కెప్టెన్గా ఎంపికైన భువనేశ్వర్ కుమార్ కూడా తొలి వన్డేలో నిరాశాజనిత పర్ఫామెన్స్ ఇచ్చాడు...
9 ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ, 7 ఎకానమీతో 63 పరుగులు సమర్పించుకున్నాడు. భువీ స్పెల్లో మిగిలిన బౌలర్ల కంటే ఎక్కువగా ఏకంగా 5 వైడ్లు కూడా ఉండడం విశేషం...
డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్, ఆఖరి ఓవర్లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక్కడ భారత జట్టు బౌలర్లలో వికెట్ తీయలేకపోయిన ఏకైక బౌలర్ భువీ...
శ్రీలంక లాంటి ఫామ్లో లేని జట్టుపైనే వికెట్ తీయడానికి కష్టపడిన భువనేశ్వర్ కుమార్, ఏకంగా 63 పరుగులు సమర్పించుకోవడం అతనున్న ఫామ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తోంది...
మున్ముందు భారత జట్టు కీలక టోర్నీల్లో పాల్గొనబోతోంది. ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్, టీ20 వరల్డ్కప్ ఉన్నాయి. టీ20 వరల్డ్కప్లో భారత జట్టు టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా ఉంది...
అయితే బుమ్రా, భువీలాంటి బౌలర్లు సరైన పర్పామెన్స్ ఇవ్వకపోతే, విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్ ఆశ నెరవేరడం కష్టమే... సిరాజ్, దీపక్ చాహార్ రాణిస్తున్నా, వారిని మ్యాచ్ విన్నర్లుగా చెప్పలేం.
ఓ వైపు విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే, మరో వైపు భారత ప్రధాన బౌలర్లు భువనేశ్వర్ కుమార్, బుమ్రా కూడా అలాంటి పర్ఫామెన్సే ఇస్తున్నారు. ఇలాగే కొనసాగితే టీమిండియా, సెమీస్ చేరడం కూడా కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.