MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • గంగూలీని పంపించారు.. ఇక నెక్స్ట్ టార్గెట్ చేతన్ శర్మ అండ్ కో..?

గంగూలీని పంపించారు.. ఇక నెక్స్ట్ టార్గెట్ చేతన్ శర్మ అండ్ కో..?

BCCI:  కొద్దిరోజుల హైడ్రామా తర్వాత బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి  సౌరవ్ గంగూలీని పంపించిన బోర్డు పెద్దలు.. ఇప్పుడు నేషనల్ సెలక్షన్ కమిటీ చైర్మన్  చేతన్ శర్మ మీద కన్నేశారు.  

2 Min read
Author : Srinivas M
Published : Oct 19 2022, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పలు నాటకీయ పరిణామాల మధ్య  సౌరవ్ గంగూలీని రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కకుండా అడ్డుకుని అతడిని బోర్డు నుంచి పంపించిన బీసీసీఐ పెద్దలు ఇప్పుడు తర్వాత  టార్గెట్ ను కూడా నిర్దేశించుకున్నారు.  దాదా వర్గానికి చెందిన  వ్యక్తులను కూడా బోర్డు నుంచి తప్పించాలని  కంకణం కట్టుకున్న బోర్డు పెద్దలు..  ఇప్పుడు నేషనల్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ చేతన్ శర్మ మీద కన్నేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక  మాజీ ఆల్ రౌండర్ అయిన చేతన్ శర్మను సెలక్షన్ కమిటీకి చైర్మెన్ గా నియమించాడు.  క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సిఫారసులు మేరకు 2020 డిసెంబర్ లో కొత్త సెలక్షన్ కమిటీ  నియామకం జరిగింది. ఈ కమిటీకి చేతన్ శర్మ  నేతృత్వం వహిస్తుండగా.. అభయ్ కురువిల్లా, దేబశీష్ మెహంతీలు సభ్యులుగా ఉన్నారు.  

37

అయితే బీసీసీఐ నుంచి దాదాను పంపించిన తర్వాత  ఇప్పుడు   చేతన్ శర్మ వర్గాన్ని కూడా సాగనంపేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తర్వాత చేతన్ శర్మ అండ్ కో. మీద ఎలాంటి చర్యలుంటాయనేది తేలనుంది. 

47

ఇదే విషయమై బీసీసీఐ  ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘భారత జట్టు టీ20 ప్రపంచకప్ లో రాణించేదానిని బట్టి చేతన్ శర్మ భవితవ్యం ఆధారపడి ఉంది. చేతన్ శర్మ పనితీరుపై కొత్త పాలకవర్గంలో కూడా ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. కానీ వాళ్లు కొత్త సెలక్షన్ కమిటీని కోరుకుంటున్నారు. అయితే చేతన్ శర్మ మాత్రం బీసీసీఐ కొత్త  క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ని నియమించేవరకూ అతడు  తన పదవిలోనే కొనసాగుతాడు..’ అని తెలిపాడు. 

57

చేతన్ శర్మ సంగతి అలా ఉంటే మెహంతీ, కురువిల్లా  లు మాత్రం తిరిగి వాళ్ల స్థానాలు దక్కించుకోవడం కష్టమేనని తెలుస్తున్నది. కొద్దిరోజుల్లో మెహంతీ బీసీసీఐలో తన పదవీకాలం ముగించుకోనున్నాడు. అతడు తిరిగి  పోటీ చేస్తాడా..? లేదా..? అనేది ప్రశ్నార్థకమే అయినా మెహంతీని కొనసాగించేందుకు కొత్త పాలకవర్గం సిద్ధంగా లేదని తెలుస్తున్నది.  కురువిల్లా పదవీకాలం ముగియకపోయినా అతడి మెడపైనా కత్తి వేలాడుతున్నది. 

67

మెహంతీ, కురువిల్లా స్థానాల్లో  ఒడిశాకు చెందిన మాజీ క్రికెటర్ శివ సుందర్ దాస్, బెంగాల్  మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా,  నేషనల్ జూనియర్ సెలక్టర్  రణ‌దేవ్ బోస్  సెలక్షన్ కమిటీలో చోటు దక్కించుకునే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. 

77

వీరితో పాటు బెంగాల్ కు చెందిన  మాజీ వన్డే క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా  లేదా ఒడిశాకు చెందిన సంజయ్ రౌల్ లో ఒకరికి అవకాశమివ్వొచ్చునని  సమాచారం. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Recommended image2
Richa Ghosh: రిచా ఘోష్‌ను అక్కడ ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా !
Recommended image3
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved