టీమిండియాలో మరో పాజిటివ్ కేసు... సహాయక సిబ్బందికి పాజిటివ్, మరో ముగ్గురు కోచింగ్ స్టాఫ్...
ఇంగ్లాండ్ టూర్లో కరోనా ప్రోటోకాల్ను లెక్కచేయకుండా 20 రోజుల పాటు ఫుల్లుగా హాలీడేస్ ఎంజాయ్ చేసిన భారత జట్టుకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టైంది. ఇప్పటికే ఫుట్బాల్ మ్యాచులు చూసేందుకు వెళ్లిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పాజిటివ్గా తేలగా, ఇప్పుడు ఆ లిస్టులోకి మరో సభ్యుడు చేరాడు...
బయో బబుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత యూరో 2020 లీగ్ ఫుట్బాల్ మ్యాచులను చూసేందుకు వెళ్లిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, అక్కడ ఫ్యాన్స్తో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లతో ఫుల్లు బిజీగా గడిపాడు...
ఫలితంగా 8 రోజుల క్రితమే అతనికి పాజిటివ్ వచ్చినట్టు, ఇంగ్లాండ్లోని తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్లో ఉండి... కరోనా నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా...
రిషబ్ పంత్ మినహా భారత జట్టులోని ప్లేయర్లందరికీ కరోనా నెగిటివ వచ్చినట్టు నిర్ధారణ చేశాడు రాజీవ్ శుక్లా. అయితే క్రికెటర్లలో పాజిటివ్ కేసు రాకపోయినా భారత బృందంలోని సహాయక సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్టు తేలింది...
కరోనా సోకిన వ్యక్తితో పాటు డెహ్రామ్కి వచ్చిన మరో ముగ్గురు కోచింగ్ అసిస్టెంట్లు కూడా ఐసోలేషన్లోకి వెళ్లారు. వీరితో భారత క్రికెటర్లు కానీ, మిగిలిన సభ్యులు కానీ కలవలేదని తెలిసింది...
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు జూలై 20 నుంచి డెహ్రామ్లో ఓ కౌంటీ క్లబ్తో కలిసి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ పాల్గొవడం అనుమానమే.