MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • year roundup 2021: స్టార్టప్‌ల నుండి స్టాక్ మార్కెట్ వరకు.. కరోనాకాలంలో కూడా ఉద్యోగావకాశాలు..

year roundup 2021: స్టార్టప్‌ల నుండి స్టాక్ మార్కెట్ వరకు.. కరోనాకాలంలో కూడా ఉద్యోగావకాశాలు..

ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా దేశీయ స్టార్టప్‌లకు 2021లో $36 బిలియన్ల అంటే 3600 కోట్ల పెట్టుబడి వచ్చింది, ఇది 2020 కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ సంవత్సరం 33 స్టార్టప్ యునికార్న్‌లు సృష్టించబడ్డాయి, భారతదేశం కంటే యూ‌కే ప్రపంచంలోనే నంబర్-3గా నిలిచింది. 

4 Min read
Ashok Kumar | Asianet News
Published : Dec 27 2021, 01:26 PM IST| Updated : Dec 27 2021, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

విశేషమేమిటంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ కారణంగా గత మూడేళ్లలో మెట్రో నగరాలతో పాటు టైర్-1, టైర్-2 ప్రాంతాల్లో స్టార్టప్‌లు విస్తరించాయి. దేశంలోని మొత్తం స్టార్టప్‌లలో టైర్ 1 అండ్ టైర్ 2 నగరాల వాటా 45 శాతానికి పెరిగింది.

ఐ‌పి‌ఓలు: 
 టెక్ కంపెనీలు ఇంకా కొత్త స్టార్టప్‌ల నుండి వచ్చిన బలమైన ప్రదర్శనల కారణంగా ఈ సంవత్సరం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లు (IPOs) రికార్డులను బద్దలు కొట్టాయి. 2021లో మాత్రమే వచ్చినన్ని ఐ‌పి‌ఓలు గత 3 సంవత్సరాలలో రాలేదు. రుణ చెల్లింపు, వ్యాపార విస్తరణ కోసం 63 కంపెనీలు ఐపీఓ ద్వారా మొత్తం రూ.1,18,704 కోట్లను సమీకరించాయి. గతేడాది 15 ఐపీఓల నుంచి సేకరించిన రూ.26,613 కోట్లకు ఇది దాదాపు నాలుగున్నర రెట్లు ఎక్కువ.

ఐపీఓ ఆవరేజ్ సైజ్ రూ.1,884 కోట్లుగా ఉంది. అయితే పేటి‌ఎం, స్టార్ హెల్త్  వంటి కొన్ని పెద్ద ఐ‌పి‌ఓలు కూడా పెట్టుబడిదారులను నిరాశపరిచాయి. ఆ తర్వాత ఐపీఓల్లో ఒకటి, రెండు మినహా మిగిలినవి నష్టాలతో లిస్ట్ అయ్యాయి. 

ఈ సంవత్సరం బలమైన పర్ఫర్మెంస్ తర్వాత 2022లో ఐ‌పి‌ఓ నుండి దాదాపు 2 లక్షల కోట్లను సమీకరించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఐ‌పి‌ఓ కోసం 15 బిలియన్ల డాలర్ల ప్రతిపాదన ఇప్పటికే సెబి (SEBI)కి పంపబడింది. అలాగే 11 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను త్వరలో పంపే అవకాశం ఉంది.

27

అందరి కళ్లు ఎల్‌ఐసీపై 
 కొత్త సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓపై అందరి దృష్టి పడింది. ఈ ఐ‌పి‌ఓ ద్వారా ప్రభుత్వం తన వాటాను విక్రయించనుంది, ఇనాక్ 1 లక్ష కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అదానీ విల్మర్, ఓలా, ఫ్లిప్‌కార్ట్ అండ్ స్నాప్‌డీల్ వంటి కంపెనీలు కూడా ఐ‌పి‌ఓ తీసుకురావచ్చు.

ప్రపంచ కర్మాగారంగా భారతదేశం 
ఎలక్ట్రానిక్ వాహనాల పరికరాలు, సోలార్ ప్యానెల్లు, బ్యాటరీలు, బొమ్మలు, వినియోగదారు ఉత్పత్తులు I సహా వందలాది వస్తువుల కోసం ఇతర దేశాల నుండి దిగుమతులపై ఆధారపడతాము. ఇలాంటి పరిస్థితిలో 13 రంగాలలో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని తయారీ కంపెనీలకు రూ. 1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకం అందించబడుతుంది, ఇది భారతదేశాన్ని ప్రపంచ కర్మాగారంగా మార్చే లక్ష్యన్ని నెరవేరుస్తుంది. ఉత్పత్తి పెరుగుదలతో ఎగుమతులు కూడా సంవత్సరానికి 465 బిలియన్ల డాలర్ల ప్రతిష్టాత్మక స్థాయికి చేరుకోవచ్చు.

37

 మౌలిక సదుపాయాలు 
ఇప్పటికే ఆలస్యమైన ప్రాజెక్టుల పనులను  కరోనా మహమ్మారి మందగించింది. 439 ప్రాజెక్టుల వ్యయం రూ.4.38 లక్షల కోట్లు పెరిగింది. దీనిని పరిష్కరించడానికి, ప్రభుత్వం ఆగస్టు 15న గతి శక్తి యోజనను ప్రారంభించింది అలాగే 2025 నాటికి 107 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కొత్త ప్రాజెక్టుల కోసం నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ బ్లూప్రింట్‌ను కూడా సమర్పించారు. ఇందులో రోడ్లు, విమానయానం, టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు సహా 13 రంగాల నుంచి 2024 నాటికి రూ.6 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికకు భిన్నమైనది. 

47

బ్యాంకింగ్:  
బ్యాంకుల మొండి బకాయిలను తగ్గించేందుకు బ్యాండ్ బ్యాంక్‌ను రూపొందించారు ఇంకా 2 లక్షల కోట్ల ఎన్‌పీఏలను పరిష్కరించడానికి రూ.30,600 కోట్ల హామీ కూడా తీసుకోబడుతుంది. 
ప్రథమార్థంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ లాభాలను ఆర్జించాయి. తొలి త్రైమాసికంలో 14,012 కోట్లు, రెండో త్రైమాసికంలో 17,132 కోట్లు. కాబట్టి, మొదటి అర్ధభాగంలోనే నికర లాభం అంతకుముందు పూర్తి సంవత్సరం 31,820 కోట్ల లాభానికి దగ్గరగా ఉంది. 

NPAలు కూడా 8.35 లక్షల కోట్లకు తగ్గాయి, అయితే రిజర్వ్ బ్యాంక్ మొండి బకాయి మొత్తాన్ని మళ్లీ పెంచుతుందని హెచ్చరించింది. మార్చి 2022 నాటికి NPA 9.80%గా అంచనా వేసింది. రివర్స్ రెపో రేటును తగ్గించడం ద్వారా ఆర్‌బిఐ బ్యాంకులకు మూలధనాన్ని అందించింది. దీంతో 9 లక్షల కోట్ల అదనపు మూలధనం వచ్చింది.

బ్యాంకులపై మొండి బకాయిలను తగ్గించేందుకు బ్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడంతోపాటు రెండు లక్షల కోట్ల ఎన్‌పీఏలను పరిష్కరించడానికి రూ.30,600 కోట్ల గ్యారెంటీ కూడా తీసుకోనున్నారు.

57

చిప్ సంక్షోభం ఇంకా పెరుగుతున్న ఖర్చులు
ఏడాది పొడవునా  చిప్ సంక్షోభం ఆటో పరిశ్రమను తాకాయి . ప్రపంచ మార్కెట్‌లో సెమీకండక్టర్ల కొరత కారణంగా దేశీయ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకోవలసి వచ్చింది. దీని ప్రభావం అమ్మకాలపై కూడా కనిపించింది. ముడిసరుకు ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి ఏడాదికి మూడుసార్లు వాహనాల ధరలు పెరిగాయి. 

ఆటో రంగ పరిశ్రమ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. దీంతో ఆటో కంపెనీలకు కాస్త ఊరట లభించింది. సెమీకండక్టర్ల తయారీకి ఒక ప్రధాన అడుగు వేస్తూ, రూ. 76,000 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) ఆమోదించబడింది. ఇది దేశంలో ఆవిష్కరణ ఇంకా ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు స్వావలంబన(self reliant) భారతదేశ ప్రచారాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే, సెమీకండక్టర్ ఉత్పత్తి రంగంలో దాదాపు 1.75 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. డిస్‌ప్లే యూనిట్‌లను తయారు చేసే కంపెనీలు కూడా ఈ ప్లాన్‌లో చేర్చబడ్డాయి. 

పెట్రోలు, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు త్వరలో డ్యూయల్ ఇంజన్ (flex engine) వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆటో కంపెనీలను ఆదేశించింది. కంపెనీలు 6 నెలల్లో వాటిని అమలు చేయాలి. ఫ్లెక్స్ ఇంధనం అనేది పెట్రోల్ అండ్ మిథనాల్ లేదా ఇథనాల్ మిశ్రమం.

67

పెట్టుబడిదారులపై డబ్బు వర్షం
వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు ఇంకా విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం 2021లో స్టాక్ మార్కెట్‌ను కొత్త గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. సెన్సెక్స్ తొలిసారిగా 50 వేలు దాటడమే కాకుండా 60 వేలు దాటి ఏడు నెలల్లో 62,259 గరిష్ట స్థాయిని తాకింది. ఈ ఏడాది 20 శాతానికి పైగా రాబడులను అందించింది, పెట్టుబడిదారుల మూలధనాన్ని రూ. 72 లక్షల కోట్ల నుడి రూ. 260 లక్షల కోట్లకు పెంచింది.

మార్కెట్‌లో ర్యాలీ కారణంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కూడా లాభపడింది. ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు 24 శాతం పెరిగి రూ.38.45 లక్షల కోట్లకు చేరాయి. డిసెంబర్, 2020 నాటికి మ్యూచువల్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం 31 లక్షల కోట్లు. 
ఈక్విటీ, డేబ్ట్ ఆప్షన్ల ద్వారా కంపెనీలు కూడా రూ.9.01 లక్షల కోట్లు సమీకరించాయి. ఇందులో 5.53 లక్షల కోట్లు డేబ్ట్ మార్కెట్ నుంచి, 2.1 లక్షల కోట్లు ఈక్విటీ నుంచి వచ్చాయి. ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్లలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు పెరిగాయి

77

టెలికాం
ఈ సంవత్సరం సమస్యాత్మక రంగానికి చాలా విధాలుగా ఉపశమనం కలిగించింది. బకాయిల చెల్లింపు నుండి కంపెనీలకు ఉపశమనం కలిగించడంతో పాటు 5G సేవలను ప్రారంభించే దిశలో అనేక చర్యలు తీసుకున్నారు. దేశీయ అండ్ విదేశీ కంపెనీల సహకారంతో 5G సర్వీస్ కోసం ప్రొవైడర్ ఆప్షన్ పూర్తి చేసింది. ఇది చైనా కంపెనీలను మినహాయించి ఎయిర్‌టెల్, జియో, దేశీయ కంపెనీలకు మరిన్ని అవకాశాలను ఇచ్చింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ ఉపశమన చర్యల వల్ల టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీలో మరింత దూకుడుగా పెట్టుబడులు పెట్టగలవని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చెబుతోంది.  ఇంకా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5G సేవలపై 1.5 నుండి 1.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టవచ్చు. మరికొద్ది నెలల్లో 5జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved