MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇకపై మీరు PF అమౌంట్ ATM నుంచే విత్ డ్రా చేయొచ్చు: ఎప్పటి నుంచో తెలుసా?

ఇకపై మీరు PF అమౌంట్ ATM నుంచే విత్ డ్రా చేయొచ్చు: ఎప్పటి నుంచో తెలుసా?

ఏడు కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ఇది నిజంగా శుభవార్త. ఇకపై PF అమౌంట్ ATM నుంచే విత్ డ్రా చేయొచ్చు. ఈ సౌకర్యం ఎప్పటి నుంచి అమలులోకి రాబోతోందో ఇక్కడ తెలుసుకుందాం రండి.  

1 Min read
Naga Surya Phani Kumar
Published : Dec 13 2024, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

EPFO వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎఫ్ డబ్బును ఏటీఎంల నుంచి నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చని ఇటీవల కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దౌరా భారీ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, కార్మికులకు మేలు చేయాలని, వారికి కేంద్రం అందిస్తున్న సౌకర్యాలు మరింత సింపుల్ గా, త్వరగా అందించాలని టెక్నాలజీలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 
 

24

కార్మిక కార్యదర్శి ఇంకే చెప్పారంటే.. పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ దాఖలు చేసిన క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించేలా ఐటీ శాఖను మెరుగు పరుస్తున్నామన్నారు. అదేవిధంగా ఉద్యోగులు, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరిన్ని సదుపాయాలను సింపుల్ ప్రాసెస్ లో అందిచేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. 
 

34

పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా విషయానికొస్తే..  ఇప్పుడు క్లెయిమ్ చేసే లబ్ధిదారుడు తన క్లెయిమ్ మొత్తాన్ని నేరుగా ATM నుండి తీసుకొనేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తప్పులు జరగకుండా ఉంటాయి. ఎవరికీ కమీషన్లు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పీఎఫ్ ప్రాసెస్ అంతా పారదర్శకంగా జరుగుతుంది. బ్యాంకుల్లో డబ్బులు విత్ డ్రా చేయడం కోసం పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. 
 

44

పీఎఫ్ అమౌంట్ కోసం ఉద్యోగులు EPFO ​​వెబ్‌సైట్ (https://www.epfindia.gov.in) లేదా ఉమాంగ్ యాప్ ద్వారా అప్లై చేయాలి. అదే సమయంలో కొంత మొత్తాన్ని ఏటీఎం ద్వారా తీసుకొనేందుకు క్లెయిమ్‌లను సమర్పించాలి. ఈ సౌకర్యం 2025 ప్రారంభం నుంచి అమలు కాబోతోందని కేంద్ర కార్మిక శాఖ అధికారులు వెల్లడించారు. వారు మాట్లాడుతూ 'వ్యవస్థలను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తున్నాం.  ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి అభివృద్ధికి సంబంధించి భారీగా మార్పులు వస్తాయి. ఈ మార్పులు జనవరి 2025 నుండి ప్రారంభమవుతాయని అన్నారు. EPFOలో IT 2.1 వెర్షన్ అప్ గ్రేడ్ అవుతోందని, అందువల్ల ఉద్యోగులు, కార్మికులకు అందాల్సిన సేవలు మరింత సులభం కానున్నాయని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దౌరా వెల్లడించారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate: బంగారం కొంటే భారీ ధర.. అమ్మితే తక్కువ ధర, ఎందుకు ఈ తేడా?
Recommended image2
Pets in Train: మీ పెంపుడు జంతువులను రైలులో తీసుకువెళ్లాలనుకుంటున్నారా? ఇలా టికెట్ బుక్ చేయండి
Recommended image3
Business Ideas : కేవలం వేలల్లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఇంటి నుండే లక్షలు సంపాదించవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved