MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Banks Merge: అతి త్వరలో ఈ నాలుగు బ్యాంకులు కనిపించవు, ఆ బ్యాంకు కస్టమర్లకు కష్టమే

Banks Merge: అతి త్వరలో ఈ నాలుగు బ్యాంకులు కనిపించవు, ఆ బ్యాంకు కస్టమర్లకు కష్టమే

Banks Merge: బ్యాంకుల విలీనం అనేది అప్పుడప్పుడు ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఇప్పుడు మరొకసారి మెగా విలీనానికి సిద్ధమవుతోంది. నీతి ఆయోగ్ సిఫార్సుతో కొన్ని బ్యాంకులు విలీనం చేయబోతోంది. 

2 Min read
Haritha Chappa
Published : Nov 02 2025, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బ్యాంకుల విలీనం
Image Credit : Getty

బ్యాంకుల విలీనం

మనదేశంలో బ్యాంకింగ్ రంగం ఎంతో పెద్దది. పదుల సంఖ్యలో బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వం మరోసారి బ్యాంకుల మెగా విలీనానికి సిద్ధమవుతోంది. నీతి ఆయోగ్ సిఫార్సులను అనుసరించే ఈ పని చేస్తోంది. చిన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను పెద్దవాటిలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తోంది. నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న బ్యాంకుల్లో నాలుగు బ్యాంకులు భవిష్యత్తులో కనిపించవు. ఆ బ్యాంకులు ఏంటో తెలుసుకోండి.

24
ఈ బ్యాంకులు కనిపించవు
Image Credit : Bank of baroda

ఈ బ్యాంకులు కనిపించవు

ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. దీనివల్ల ఆ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకులను ఏదైనా పెద్ద బ్యాంకులలో విలీనం చేస్తారు. ఆ విలీనం చేసిన కొత్త బ్యాంకు కస్టమర్ గా మారేందుకు చెక్ బుక్ నుండి పాస్ బుక్ ల వరకు ఎన్నో మార్పులు చేయాల్సి వస్తుంది. అతి త్వరలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను పెద్ద బ్యాంకులలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Related Articles

Related image1
Fake Rs500 Notes: చలామణిలో భారీగా నకిలీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా చూసి తీసుకోండి
Related image2
Gold Hunting: తుఫాను ఎఫెక్ట్.. ఉప్పాడ తీరంలో బంగారం వేట, జనాలతో నిండిపోయిన బీచ్
34
ఏ బ్యాంకులలో కలుపుతారు?
Image Credit : SBI

ఏ బ్యాంకులలో కలుపుతారు?

పైన చెప్పిన నాలుగు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో విలీనం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. భవిష్యత్తులో కూడా మిగతా అన్ని చిన్న బ్యాంకులను ఈ మూడు పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీనివల్ల మనదేశంలో చాలా కొద్ది సంఖ్యలోనే బ్యాంకులు మిగులుతాయి.

44
విలీనం వల్ల కలిగే నష్టాలు, లాభాలు
Image Credit : stockPhoto

విలీనం వల్ల కలిగే నష్టాలు, లాభాలు

చిన్న బ్యాంకులు అధికంగా ఉండడం వల్ల బ్యాంకింగ్ ఖర్చులు పెరిగిపోతాయి. బ్యాంకులు పై ఒత్తిడి కూడా పెరుగుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం చేయాలంటే చిన్నచిన్న బ్యాంకులు అధిక శాతం ఉండకూడదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పోటీని తట్టుకోవడానికి ప్రభుత్వం ఇలా బ్యాంకులను అన్నింటినీ కలిపి పెద్ద బ్యాంకులుగా మార్చేందుకు సిద్ధపడుతోంది. చిన్న బ్యాంకులను.. పెద్ద బ్యాంకులలో విలీనం చేయడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నది ప్రభుత్వాలోచన. అలాగే బ్యాంకులు ఇచ్చే రుణ సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతోంది. గతంలో 2017 నుంచి 2020 మధ్య ప్రభుత్వం పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసింది. ఇంతకుముందు బ్యాంకుల సంఖ్య 27 ఉండేది. ప్రస్తుతం 12కు తగ్గింది. ఈ 12 ను కూడా నాలుగు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved