MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Budget: కోటి మంది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మీరూ ఉన్నారా?

Budget: కోటి మంది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మీరూ ఉన్నారా?

ఉద్యోగులకు, మధ్య తరగతి వారికి భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు ఫైనాన్స్ మినిస్టర్  నిర్మలా సీతారామన్‌

1 Min read
ramya Sridhar
Published : Feb 01 2025, 07:02 PM IST| Updated : Feb 01 2025, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కేంద్ర బడ్జెట్ ని శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ బడ్జెట్ లో మధ్యతగరతి వారికి చాలా ఊరట కల్పిస్తూ.. పన్ను విధానంలో మార్పులు తీసుకువచ్చారు. ఉద్యోగులకు, మధ్య తరగతి వారికి భారీ ఊరట కల్పిస్తూ ఈ ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానాన్ని తీసుకువచ్చి, దాని ప్రకారం రూ.12లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్నే చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. 

 

24

ఈ కొత్త పన్ను విధానం వల్ల అదనంగా కోటి మందికి పైగా ప్రజలకు పన్ను (Income Tax) భారం నుంచి ఊరట లభించనుంది. ఈ విషయాలను  బడ్జెట్‌ (Union Budget) ప్రసంగం తర్వాత జరిగిన మీడియా సమవేశంలో ఆమె మాట్లాడారు. బడ్జెట్‌లో ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా రూ.8 లక్షల ఆదాయం ఉన్నవారు రూ.30వేలు పన్ను కట్టేవారు.

34

ఇకపై ఏమీ పన్ను కట్టాల్సిన పని లేదు. అలాగే మిగతా శ్లాబుల్లో ఉన్నవారికీ ఊరట లభించింది. రూ.12 లక్షల వరకు ఆదాయంపై రిబేట్‌ పెంపుతో కోటి మందికి పైగా ప్రజలు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

44

ఆర్థికవ్యవస్థలోని ప్రతీ అంశాన్నీ టచ్ చేసేశా బడ్జెట్‌ను రూపొందించాం. ఖర్చు చేసే ప్రతీ రూపాయి విషయంలో చాలా వివేకంతో వ్యవహరించాం. వ్యవసాయ రంగానికి అండగా ఉంటున్నాం. సీడ్స్ నుంచి మార్కెట్‌ వరకు అన్నిరకాల మార్పులూ చేయబోతున్నాం. రుణాలు, పెట్టుబడి సాయం , కొత్త వంగడాల సృష్టి ఇలా అనేక రకాలుగా రైతులకు సపోర్ట్ చేస్తున్నాం.  చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మెరుగుపరిచాం అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
కేంద్ర బడ్జెట్
Latest Videos
Recommended Stories
Recommended image1
Gig workers: గిగ్ వర్కర్స్ కోసం కొత్త చట్టం, అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరు?
Recommended image2
క్రెడిట్ కార్డు బిల్లును EMIగా మార్చితే న‌ష్టం జ‌రుగుతుందా.?
Recommended image3
Gold Rate: బంగారం కొంటే భారీ ధర.. అమ్మితే తక్కువ ధర, ఎందుకు ఈ తేడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved