MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇండియాలో 2025 జనవరి 1 నుంచి మీరు ఊహించని మార్పులివే

ఇండియాలో 2025 జనవరి 1 నుంచి మీరు ఊహించని మార్పులివే

కొత్త సంవత్సరం 2025 చాలా మార్పులతో ప్రారంభం కానుంది. జీఎస్టీ, టెలికాం, అంతర్జాతీయ ప్రయాణాలు, టెక్నాలజీ వంటి అనేక రంగాల్లో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దేశవ్యాప్తంగా కుటుంబాలు, ఉద్యోగులు, ప్రయాణికులపై ఈ ప్రభావం పడుతుంది. ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 26 2024, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జనవరి 1, 2025 నుంచి ఇండియాలో బిజినెన్లు కఠినమైన జీఎస్టీ నిబంధనలతో నిర్వహించాల్సి ఉంటుంది. అవేంటో ఒక్కొక్కటి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 

మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA): జీఎస్టీ పోర్టల్స్‌లో సేఫ్టీని పెంచడానికి ఇకపై పన్ను చెల్లించే వారందరికీ MFA అవసరం.

ఇ-వే బిల్ లిమిటేషన్స్: 180 రోజుల కంటే పాత ప్రాథమిక డాక్యుమెంట్లకు మాత్రమే ఇ-వే బిల్‌లను రూపొందించవచ్చు. మోసాలను తగ్గించడం కోసమే ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

థాయిలాండ్ దేశం గ్లోబల్ ఇ-వీసా ప్లాట్‌ఫామ్ www.thaievisa.go.thను ప్రారంభించనుంది. దీని ద్వారా ఇండియన్స్ సహా అంతర్జాతీయ ప్రయాణికులు ఆన్‌లైన్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా డాక్యుమెంట్లు సమర్పించక్కరలేదు. పర్యాటకులకు సింపుల్ విధానంలో ఆ దేశానికి వెళ్లిపోవచ్చు. 

36

జనవరి 1, 2025 నుంచి భారతదేశంలోని మైగ్రేటెడ్ వీసా దరఖాస్తుదారులు ఎక్స్‌ట్రా ఫీజు లేకుండా ఒకసారే తమ US వీసా అపాయింట్‌మెంట్‌లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. దీని వల్ల H-1B వీసా ప్రాసెస్‌ అప్ గ్రేడ్ అవుతుంది. దీని వల్ల భారతీయ F-1 వీసా హోల్డర్‌లకు మరింత సౌకర్యం కలుగుతుంది. అయితే B1/B2 వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం వెయిటింగ్ టైమ్ ఇంకా 400 రోజులకు పైగా ఉంది.

46

కలకత్తాలోని ఐటీసీ సంస్థ, నియంత్రణ అనుమతుల తర్వాత, జనవరి 1, 2025 నుంచి తన హోటల్ వ్యాపారాన్ని అధికారికంగా సెపరేట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల హోటల్ వ్యాపారంలో లోపాలు తెలుసుకొని డవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ఐటీసీ భావిస్తోంది. 

56

కొత్త రైట్ ఆఫ్ వే (RoW) నిబంధనలు అమల్లోకి వస్తాయి. భూగర్భ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణను మెరుగుపరుస్తాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలు ఈ నిబంధనలను ఉపయోగించి తమ సేవలను మెరుగుపరుస్తాయి.

66

జనవరి 1, 2025 నుంచి అనేక పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో WhatsApp పనిచేయడం ఆగిపోతుంది. Samsung Galaxy S3, LG Nexus 4, HTC One X, Moto G వంటి మోడల్స్ ఇందులో ఉన్నాయి. గడువు ముగిసేలోపు ముఖ్యమైన చాట్‌లు, డేటాను బ్యాకప్ చేసుకోవాలని యూజర్లకు ఆయా కంపెనీలు సూచించాయి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Fall: బంగారం మళ్లీ డౌన్ ఫాల్.. వెండి కొండెక్కింది. హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే!
Recommended image2
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Recommended image3
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved