MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Whiskey: తెలుగోళ్లు ఎంతగా విస్కీ తాగేస్తున్నారో తెలుసా? దేశంలో ఇదిగో ఈ రాష్ట్రాలే టాప్

Whiskey: తెలుగోళ్లు ఎంతగా విస్కీ తాగేస్తున్నారో తెలుసా? దేశంలో ఇదిగో ఈ రాష్ట్రాలే టాప్

మనదేశంలో విస్కీ (Whiskey) ప్రియులు అధికంగానే ఉన్నారు. అత్యధికంగా విస్కీ తాగే భారత రాష్ట్రాల జాబితా విడుదలైంది. మన తెలుగు రాష్ట్రాల్లో విస్కీ తాగే రాష్ట్రాల జాబితాలో ఏ స్థానంలో ఉందో తెలుసుకోండి. 

1 Min read
Haritha Chappa
Published : Sep 30 2025, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విస్కీ ఎక్కువగా తాగే రాష్ట్రం
Image Credit : Getty

విస్కీ ఎక్కువగా తాగే రాష్ట్రం

భారత్‌లో విస్కీకి చాలా డిమాండ్ ఎక్కువ. మద్యం తాగేవారి మొదటి ఎంపిక విస్కీనే.  ప్రీమియం విస్కీకి డిమాండ్ ఇప్పుడు ఎక్కువగానే ఉంది. అందులోనూ మేడ్ ఇన్ ఇండియా, విదేశీ బ్రాండ్లకు చెందిన విస్కీకి మంచి గిరాకీ ఉంది. దేశంలో అత్యధికంగా విస్కీ తాగే రాష్ట్రం ఏదో తెలుసుకోండి. అలాగే మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో నిలిచాయో తెలుసుకోండి.

25
నెంబర్ 1 రాష్ట్రం ఏది?
Image Credit : Getty

నెంబర్ 1 రాష్ట్రం ఏది?

భారత్ లో  విస్కీ మార్కెట్ అధికంగానే ఉంది. ఇది వేగంగా వృద్ధి చెందుతోంది కూడా. 2024-25 సంవత్సరానికి గాను అత్యధికంగా విస్కీ తాగే రాష్ట్రాల జాబితాను విడుదల చేశారు. ఇందులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రజలే అధికంగా విస్కీని వినియోగిస్తున్నారు. అందుకే కర్ణాటక  మొదటి స్థానంలో నిలిచింది.

Related Articles

Related image1
Youtube: మనకు రూ.89కే యూట్యూబ్ ప్రీమియం లైట్, ఇంత చవకధరకు సబ్ స్క్రిప్షన్
Related image2
Trump Tariffs: ట్రంప్ మళ్లీ ఏసేశాడు.. మన దేశ టేబుళ్లు, కుర్చీలు, మంచాలపై కూడా పన్నులు పెంచేశాడు
35
విస్కీ అమ్మకాలు
Image Credit : freepik

విస్కీ అమ్మకాలు

నివేదిక ప్రకారంం 2024-25లో కర్ణాటకలో 6.88 కోట్ల కేసుల విస్కీ అమ్ముడైనట్టు తెలుస్తోంది. దేశ మొత్తం ప్రీమియం విస్కీ అమ్మకాల్లో కర్ణాటక వాటా 17 శాతంగా ఉంది. గత కొన్ని ఏళ్లుగా కర్ణాటక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

45
రెండో స్థానంలో తమిళనాడు
Image Credit : our own

రెండో స్థానంలో తమిళనాడు

విస్కీలో ప్రీమియం విస్కీని తాగేందుకు ఎక్కువ మంది ఆదరణ చూపిస్తున్నారు.  అత్యధికంగా ప్రీమియం విస్కీ తాగే రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. దేశ మొత్తం అమ్మకాల్లో తమిళనాడు వాటా 16 శాతం ఉంది. 2024-25లో ఇక్కడ 6.47 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి.

55
దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యం
Image Credit : our own

దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యం

ప్రీమియం విస్కీ తాగే రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. తెలంగాణలోని ప్రజలు 9 శాతం మంది విస్కీని తాగేస్తున్నారు. అంటే 3.71 కోట్ల కేసులు తాగేస్తున్నారు.  దీంతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్ 3.55 కోట్ల కేసులు విస్కీ అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved