MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate: రూ.90 వేలకు చేరిన బంగారం ధర.. వెండి ఏకంగా రూ.లక్ష, ఇంకా పెరుగుతాయా?

Gold Rate: రూ.90 వేలకు చేరిన బంగారం ధర.. వెండి ఏకంగా రూ.లక్ష, ఇంకా పెరుగుతాయా?

Gold Rate: బంగారం ధరకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. రికార్డు స్థాయిలో బంగారం ధర రూ.90 వేలకు చేరుకుంది. కేవలం బంగారమే కాకుండా వెండి సైతం రూ.లక్ష మార్కును దాటింది. బంగారం, వెండి ధరలు ఇంకా పెరుగుతాయా? తెలుసుకుందాం రండి. 

1 Min read
Naga Surya Phani Kumar
Published : Feb 14 2025, 10:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ కాలంలో బంగారంపై పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గుతున్న పరిస్థితులు కనిపించట్లేదు. మధ్య మధ్యలో కాస్త ధరలు తగ్గినా మళ్లీ ధరలు పెరగడం సాధారణంగా మారింది. కొన్ని దశాబ్దాల రికార్డులు తిరగేసినా ఇదే కనిపిస్తుంది. అందుకే చాలా మంది కాస్త డబ్బులుంటే బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. 
 

25

స్టాక్ మార్కెట్ లో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టే వారు పెరుగుతున్నారు. ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి బదులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. దీంతో బంగారు వ్యాపారులు మంచి లాభాలను పొందుతున్నారు. 
 

35

ఇప్పుడు ఇండియాలో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.88,100 గా ఉంది. ఇది ఒక్కసారిగా రూ.90,000లకు దగ్గరగా వచ్చేసింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఇక వెండి విషయానికొస్తే రికార్డు స్థాయిలో కిలో వెండి రూ.లక్షకు చేరుకుంది. వెండి ధరలు రూ.లక్షకు చేరడం ఇది తొలిసారి కాదు. 

45

ట్రంప్ ప్రకటనే కారణం..
అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై ఛార్జీలు విధిస్తున్న అన్ని దేశాలపై రెట్టింపు పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్ షేక్ అవుతోంది. ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు ఎన్నో చేశారు. వరుసగా ట్రంప్ నుంచి వస్తున్న ఇలాంటి ప్రకటనల వల్లే బంగారం ధరలు పెరిగాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 

55

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర అత్యధికంగా 2960 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ 34 డాలర్లకు చేరింది.
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
Recommended image2
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Recommended image3
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved