MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Business
  • ఏవియేషన్ పరిశ్రమపై మరోసారి కరోనా చీకటి నీడ.. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వేలల్లో విమానాలు రద్దు..

ఏవియేషన్ పరిశ్రమపై మరోసారి కరోనా చీకటి నీడ.. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వేలల్లో విమానాలు రద్దు..

కరోనా వైరస్‌ కొత్త వేరియంట్ ఓమిక్రాన్(omicron) వ్యాప్తి రోజు రోజుకి విస్తరిస్తుంది. అమెరికా నుంచి భారత్‌కు ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. చాలా దేశాల్లో మళ్లీ నిషేధం విధించేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. దీంతో విమానయాన పరిశ్రమ(aviation industry)పై మరోసారి కరోనా చీకటి నీడ కనిపిస్తుంది. ఒక నివేదిక ప్రకారం, గత శుక్రవారం నుండి ప్రపంచవ్యాప్తంగా 11,500 కంటే ఎక్కువ విమానాలు రద్దు(flights ban) చేయబడ్డాయి.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 28 2021, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మంగళవారం 1100 విమానాలు రద్దు 
న్యూ ఇయర్ సందర్భంగా విమానాలను రద్దు చేయడం పర్యాటకులకు అలాగే విమానయాన సంస్థలకు సమస్యగా మారింది. ఫ్లైట్ ట్రాకర్ FlightAware ప్రకారం, పెరుగుతున్న ఓమిక్రాన్  వ్యాప్తి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. దీని ప్రకారం, సోమవారం సుమారు 3000 విమానాలు రద్దు చేయగా, మంగళవారం మరో 1100 విమానాలు రద్దు చేయబడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ వ్యాప్తి 
అమెరికా, బ్రిటన్‌తో సహా ప్రపంచంలోని చాలా దేశాలలో ఓమిక్రాన్ సోకిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. యూరప్, యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా చాలా విమానాలను రద్దు చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు సందర్శనకు వెళ్లే తరుణంలో విమాన సర్వీసులను రద్దు చేయడం గమనార్హం. విమానాల రద్దుతో  తీవ్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  

35

ఆలస్యంగా  వేలాది విమానాలు 
ప్రపంచ వ్యాప్తంగా విమానాల రద్దు గణాంకాలను పరిశీలిస్తే.. శుక్రవారం నుంచి దాదాపు 11,500 విమానాలు రద్దు కాగా, వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ ప్రకారం, కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఆఫ్ కరోనా భయం కారణంగా సిబ్బంది కొరత ఏర్పడింది, ఇది పెద్ద సమస్యను సృష్టించింది. విశేషమేమిటంటే, పాశ్చాత్య దేశాల్లోని చాలా ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు  కొత్త స్థాయికి చేరుకుంది. యూ‌ఎస్ కార్మికులను తిరిగి పనికి అనుమతించింది అలాగే భారీ కార్మికుల కొరత ఆందోళనల మధ్య సామాజిక ఐసోలేషన్ వ్యవధిని 10 నుండి ఐదు రోజులకు తగ్గించింది. దీంతో ఇన్‌ఫెక్షన్‌ కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.

మరోవైపు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు అప్పగించే ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల పట్టవచ్చు. దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడానికి జనవరి వరకు సమయం పట్టవచ్చని అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది. 
 

45

అక్టోబరు 25న ఆమోదం
కంపెనీ చేసిన బిడ్‌ను అంగీకరించడానికి 25 అక్టోబర్ 2021న టాటా సన్స్ ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆమోదం తెలిపిందని ప్రభుత్వం తెలిపింది. డిసెంబరు నెలాఖరులోగా ఈ కొనుగోలుకు సంబంధించిన లాంఛనాలు పూర్తవుతాయని ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ ఆలస్యమవుతోందని, తేదీని వెల్లడించనప్పటికీ జనవరిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
 

55

ఎనిమిది వారాల్లో ప్రక్రియ పూర్తి
 నిబంధనల ప్రకారం డెలివరీ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలి కానీ రెండు పార్టీలు అంగీకరిస్తే పొడిగించవచ్చు. ఈ ప్రక్రియ కింద, ఈ కేసులో కూడా కొనుగోలు తేదీని పొడిగించేందుకు చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రెగ్యులేటరీ అనుమతులు ఇంకా రాలేదని, అయితే త్వరలోనే పూర్తి చేస్తామని ఓ అధికారి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. ఈ ప్రక్రియ జనవరి నాటికి పూర్తవుతుందని పేరు తెలపనీ అధికారి తెలిపారు.

18 వేల కోట్ల డీల్
ఎయిర్ ఇండియాను రూ.18,000 కోట్లకు విక్రయించేందుకు ప్రభుత్వం టాటా సన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ డీల్‌కు బదులుగా టాటా ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నగదును ఇస్తుంది అలాగే ఎయిర్‌లైన్‌కు రూ.15,300 కోట్ల రుణ బాధ్యత ఉంది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ డీల్ కింద ప్రభుత్వం నగదు మొత్తాన్ని పొందుతుంది. 
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ATM: భారతదేశంలో మొట్టమొదటి ATM ఎక్కడ ఏర్పాటైంది? దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో తెలుసా.?
Recommended image2
Gold Price Crash: 10 రోజుల తర్వాత దిగొచ్చిన బంగారం.. ఎంత తగ్గిందంటే?
Recommended image3
త‌ల్లి గాజులు అమ్మి వ్యాపారం మొద‌లు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved