MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Ambani Wealth: అంబానీ ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా? సగం ఇండియాను కొనేయచ్చు

Ambani Wealth: అంబానీ ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా? సగం ఇండియాను కొనేయచ్చు

ఆసియాలోని ధనవంతుల కుటుంబంగా అంబానీ కుటుంబం పేరు తెచ్చుకుంది. తాజాగా చేసిన సర్వేలో ఇదే కుటుంబం భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. వారి ఆస్తి గతేడాదితో పోలిస్తే మరో 10 శాతం పెరిగింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 14 2025, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంబానీ కుటుంబమే టాప్
Image Credit : Instagram

అంబానీ కుటుంబమే టాప్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన కుటుంబ సంపదను అమాంతం పెంచుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే పది శాతం ఆస్తులు పెరిగాయి. హురూన్ అనే నివేదిక ప్రకారం మన దేశంలో బిలియనీర్ల ఆస్తులపై సర్వేలు జరిగాయి. ఎవరికి ఎంత ఆస్తి ఉందో హురూన్ నివేదిక వెల్లడించింది. అందులో అంబానీ కుటుంబం దగ్గరే 2025లో 28 లక్షల కోట్ల రూపాయల ఉందని తేలింది. గతేడాదితో పోలిస్తే పది శాతం వారి ఆస్తులు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ధనిక కుటుంబం అదానీ. అదానీ ఆస్తుల విలువ 14 లక్షల కోట్లు అంటే.. అంబానీ ఆస్తుల్లో సగమే. అంబానీ స్థాయికి చేరాలంటే ఎవరికైనా ఇప్పట్లో అసాధ్యమైనే చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
300 రిచెస్ట్ కుటుంబాలు
Image Credit : Instagram

300 రిచెస్ట్ కుటుంబాలు

హురున్ రీసెర్చ్ ప్రకారము మనదేశంలో 300 సంపన్న కుటుంబాలు ఉన్నాయి. వీరి చేతిలోనే 140 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అంటే మన భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో దీని వాటా 40 ఇక అంబానీ కుటుంబం మాత్రమే 12 శాతం జీడీపీని కలిగి ఉంది. అంబానీ కుటుంబం మన భారతదేశంలో సగం భూమిని కొనేశాంత ఆస్తిని కూడా పెట్టింది.

అంబానీ కుటుంబంలో విపరీతంగా లాభాలు రావడానికి వారి కృషి ఫలితమే. సంపదలో వారికి ప్రతి ఏడాది నిరంతర వృద్ధి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే వారి సంపద 10 శాతం పెరిగింది. టెలికాం, రిటైల్, పెట్రోలియం ఉత్పత్తులు ఇలా అనేక రంగాలలో మీరు పెట్టబడులు పెట్టి విపరీతమైన లాభాలను ఆర్జిస్టున్నారు. అంబానీ, అదానీ తరువాత కొన్ని సంపన్న కుటుంబాలు ఉన్నాయి.

35
అంబానీ, అదానీ తరువాత ఎవరు?
Image Credit : Instagram

అంబానీ, అదానీ తరువాత ఎవరు?

అంబానీ, అదానీ తర్వాత మూడో స్థానంలో కుమార్ మంగళం బిర్లా కుటుంబం నిలిచింది. వీరి ఆస్తులు విలువ 6.47 లక్షల కోట్లు. నిజానికి వీరు గత పోలిస్తే 20 శాతం వృద్ధిని సాధించారు. అయినా కూడా అంబానీ ఆస్తుల్లో మూడోవంతునే కలిగి ఉన్నారు.

ఆ తర్వాత జిందాల్ కుటుంబం 5.70 లక్షల కోట్ల రూపాయల నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదో స్థానంలో 5.6 లక్షల కోట్ల రూపాయలతో బజాజ్ కుటుంబం స్థానం సంపాదించింది. కొన్ని కుటుంబాలు వేగంగానే అభివృద్ధి చెందుతున్నాయి. మరికొన్ని కుటుంబాలను వ్యాపారాల్లో నష్టం, మార్కెట్ నుంచి వచ్చే సవాళ్ల వల్ల వెనుకబడిపోయాయి.

45
హురున్ నివేదిక అంటే ఏమిటి?
Image Credit : Instagram

హురున్ నివేదిక అంటే ఏమిటి?

హురూన్ ఇండియా ప్రతి ఏడాది పరిశోధనలు చేసి నివేదికలు అందిస్తుంది. ఈ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాను ఇది విడుదల చేస్తుంది. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు, సంపద పెరుగుదల, క్షీణత వంటివి లెక్కించేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుంది. 2025లో ఏ కుటుంబాలు అయితే ఎనర్జీ, టెలికాం, ఐటి, రిటైల్ రంగాల్లో ఉన్నాయో వారే సంపన్న కుటుంబాలుగా నిలిచాయి.

55
అంబానీని చేరుకోవడం కష్టమే
Image Credit : Instagram

అంబానీని చేరుకోవడం కష్టమే

కొన్ని సంవత్సరాలుగా ఆసియా అలాగే మనదేశంలో అత్యంత ధనిక కుటుంబంగా అంబానీ కుటుంబమే మొదటి స్థానంలో నిలుస్తోంది. రిలయన్స్... మొదట వస్త్ర వ్యాపారంతో మొదలైంది. ఆ తర్వాతే పెట్రో కెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం ఇలా అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది. చాలా తక్కువ కాలంలోనే వీరు సంపన్న వ్యాపారవేత్తలుగా మారారు. తండ్రి మరణం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ను ముఖేష్ అంబానీ తీసుకున్నారు. ఇక ఇతర వ్యాపారాలను అనిల్ అంబానీకి అప్పగించారు. ముఖేష్ అంబానీ తాను తీసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఆయన కృషి పట్టుదలతో ఎదిగేలా చేశారు. అనేక శాఖలుగా, ఉప శాఖలుగా పెంచుకుంటూ వెళ్లారు. అనేక ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు. అవన్నీ కలిసి వచ్చి ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved