MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Union Budget 2022: అత్యంత పొడవైన, అతి చిన్న బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు ఎవరో తెలుసా..?

Union Budget 2022: అత్యంత పొడవైన, అతి చిన్న బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు ఎవరో తెలుసా..?

భారతదేశ బడ్జెట్ చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన, ముఖ్యమైన విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేశంలోని పార్లమెంట్‌(parliament)లో ఇప్పటివరకు అందించిన పెద్ద  బడ్జెట్ ప్రసంగం (budget speech)గురించి మాట్లాడితే ఈ రికార్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) పేరిట నమోదైంది. కానీ, ఆర్థిక మంత్రిగా కొన్ని పదాలు మాత్రమే చదివి  అంటే అత్యంత చిన్న బడ్జెట్ ప్రసంగం ఎవరు చదివారో తెలుసా..

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jan 15 2022, 12:22 PM IST| Updated : Jan 25 2022, 08:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కరోనా నీడలో బడ్జెట్2022
ప్రభుత్వం సాధారణ బడ్జెట్ ద్వారా ఖర్చుల ఖాతాను సమర్పిస్తుంది. దీంతో పాటు కొత్త పథకాలను కూడా  దేశ ప్రజల ముందు ఉంచుతారు. ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. కరోనా మహమ్మారి దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా కుదిపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు చేశారన్నది ఈ ఏడాది బడ్జెట్‌లో ఆసక్తికరంగా మారింది. 

24

నిర్మలా సీతారామన్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం
బడ్జెట్ చరిత్రలో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాల గురించి మాట్లాడితే ఇప్పటివరకు లాంగ్ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు మీద ఉంది. గతేడాది 2 గంటల 41 నిమిషాల పాటు ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి 17 సంవత్సరాల ముందు, జస్వంత్ సింగ్ 2003లో 2 గంటల 13 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు, ఇది ఇంతకు ముందు రికార్డ్.  

34

అతి చిన్న బడ్జెట్ ప్రసంగాన్ని చదివీన హిరూభాయ్ పటేల్
1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాడు అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యత హిరూభాయ్ ఎం పటేల్‌కు అప్పగించారు. ఆ తర్వాత 1977 మార్చిలో హిరూభాయ్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలు మాత్రమే, ఇది కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తయింది. ఇది అత్యంత తక్కువ బడ్జెట్ ప్రసంగంగా పరిగణించబడుతుంది.

44

ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ఎవరు సమర్పించారు
మొరార్జీ దేశాయ్ భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా పదిసార్లు దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఎనిమిది బడ్జెట్లు ఇంకా రెండు మధ్యంతర బడ్జెట్లు ఉంటాయి. మొరార్జీ దేశాయ్ తర్వాత అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరం పేరిటే ఉంది. ఆయన 9 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశ సాధారణ బడ్జెట్‌ను 6 సార్లు ప్రవేశపెట్టారు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి
Recommended image2
Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్
Recommended image3
Low Budget Phones: రూ.10,000లోపు వచ్చే అద్భుతమైన 5G ఫోన్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved