MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • TTD : ఎవ‌రి రికమండేష‌న్లు అవ‌స‌రం లేదు.. 2 గంటల్లోనే శ్రీవారి స‌ర్వద‌ర్శ‌నం.. తిరుమ‌ల‌లో సంచ‌ల‌న మార్పులు

TTD : ఎవ‌రి రికమండేష‌న్లు అవ‌స‌రం లేదు.. 2 గంటల్లోనే శ్రీవారి స‌ర్వద‌ర్శ‌నం.. తిరుమ‌ల‌లో సంచ‌ల‌న మార్పులు

Tirumala Tirupati Devasthanam (TTD) : తిరుమ‌ల‌ శ్రీవారి సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ప్ర‌క‌టించింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 18 2024, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tirumala

Tirumala

Tirumala Tirupati Devasthanam (TTD) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి తిరుమల ఆలయ నిర్వహణ, దాని సౌకర్యాలను మెరుగుపరచడానికి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి ద‌ర్శ‌నం విష‌యంలో సామాన్యుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ కీల‌క నిర్ణ‌యంలు తీసుకుంది. తిరుమ‌లేశుని ద‌ర్శ‌నం కోసం ఇప్పుడు గంట‌లు గంట‌లు క్యూలైన్లో నిల్చోవాల్సిన ప‌నిని త‌గ్గించ‌నుంది టీటీడీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తిరుమలలో రాజకీయ చర్చలపై నిషేధం, అతిథి గృహాలకు ఆ పేర్లకు నో

తిరుమల ఆలయ ప్రాంగణంలో రాజకీయ చర్చలపై నిషేధం విధిస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయం ఆధ్యాత్మికతపై దృష్టి సారించి, రాజకీయ ప్రభావం లేకుండా ఉండేలా చూడాలని టీటీడీ కోరింది. రాజ‌కీయ అంశాల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని తెలిపింది. 

అలాగే, అతిథి గృహాలకు వ్యక్తిగత పేర్లు ఉండ‌వ‌నే నిర్ణ‌యాలు కూడా తీసుకుంది. తిరుమలలోని అతిథి గృహాలకు వ్యక్తిగత, రాజకీయ పేర్లను పెట్టరాదని టీటీడీ నిర్ణయించింది. ఈ నియమం ఆలయ సముదాయ సాంప్రదాయ, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఉన్న విష‌యాల‌ను స్ప‌ష్టం చేసింది.

35
Tirumala

Tirumala

రెండు మూడు గంట‌ల్లోనే శ్రీవారి స‌ర్వ దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల్లో ద‌ర్శ‌నాలు ఒక‌టి. ఇక నుంచి వీలైనంత త్వ‌ర‌గా భ‌క్తుల‌కు శ్రీవారి ద‌ర్శ‌నం కోసం తగిన ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్టు టీటీడీ తెలిపింది. 

సుదీర్ఘ నిరీక్షణ సమయం గురించి పెరుగుతున్న ఆందోళన మ‌ధ్య TTD సర్వదర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు 2-3 గంటల్లో వారి దర్శనం (శ్రీవారి దర్శనం) క‌ల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. స‌ర్వద‌ర్శ‌నంతో పాటు అన్ని ద‌ర్శ‌నాల స‌మ‌యం త‌గ్గించ‌డానికి టెక్నాల‌జీ సాయం తీసుకుంటామ‌నే నిర్ణ‌యాలు తీసుకున్నారు. దీంతో శ్రీవారి ద‌ర్శ‌నం కోసం సామ‌న్యుల‌తో పాటు అంద‌రూ వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, యాత్రికులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి సహాయపడుతుంది.

45

సామాన్య భక్తులకు వేగంగా తిరుమ‌లేషుని దర్శనం క‌ల్పించ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాల‌జీని ఉప‌యోగించుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాల‌జీతో వ‌ర్చువ‌ల్ లైన్లు ఏర్పాటు చేసి.. కేవ‌లం రెండుమూడు గంట‌ల్లోనే తిరుమ‌ల శ్రీనివాసుని ద‌ర్శ‌నం క‌ల్పించ‌డానికి అవ‌స‌ర‌మైన విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

శారదా పీఠం లీజు రద్దు-హిందూయేత‌రుల సేవ‌లకు స్వ‌స్తి

విశాఖపట్నంలోని శారదా పీఠం లీజు ఒప్పందాన్ని రద్దు చేస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అదనంగా, శారదా పీఠం భవనాన్ని నేరుగా నిర్వహించడానికి టీటీడీ పూర్తి నియంత్రణను తీసుకోవాలని భావిస్తోందని తెలిపారు. 

55
<p><strong>ttd</strong></p>

<p><strong>ttd</strong></p>

హిందూయేతర ఉద్యోగులకు సేవల ముగింపు ప‌ల‌కాల‌ని కూడా టీటీడీ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. ఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర మతాలకు చెందిన ఉద్యోగుల సేవలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిర్ణయం ఆలయ సిబ్బంది సంస్థ మతపరమైన, ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు తీసుకున్నారు. బోర్డు తీసుకున్న నిర్ణ‌యాలు తిరుమల పవిత్రతను నిలబెట్టడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, మొత్తంగా భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన‌విగా సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved