MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తిరుప‌తి తొక్కిస‌లాట‌లో షాకింగ్ విష‌యాలు.. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే?

తిరుప‌తి తొక్కిస‌లాట‌లో షాకింగ్ విష‌యాలు.. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే?

Tirupati stampede: తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా.. శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద తొక్కిసలాటలు జ‌రిగాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన గురించి షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.  

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jan 09 2025, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Tirupati stampede: తిరుపతిలో విషాదకరమైన తొక్కిసలాట కాణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 48 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉందని కూడా స‌మాచారం. తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా.. శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూలు తొక్కిసలాటలు జ‌రిగాయి. 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 48 మంది వర‌కు గాయ‌ప‌డ్డారు. చనిపోయిన వారిలో 5 మంది మహిళలు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తిరుప‌తి-వైకుంఠ ఏకాద‌శి ద‌ర్శ‌నం టిక్కెట్ల జారీ స‌మ‌యంలో తొక్కిస‌లాట‌

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ నేప‌థ్యంలో పెద్ద ఎత్తున భ‌క్తులు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ర‌ద్దీని స‌రైన రీతిలో నిర్వ‌హించ‌లేక‌పోవ‌డంతోనే తొక్కిస‌లాట జ‌రిగింద‌ని ఈ స‌మ‌యంలో అక్క‌డున్న‌వారు చెబుతున్నారు. ఒక్క‌సారిగా భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో రావ‌డం కూడా తొక్కిస‌లాట‌కు కార‌ణంగా ఉంది. మొత్తం మూడు చోట్ల తొపులాట‌లు జ‌రిగాయి.

శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూలు వద్ద తోపులాటలు కారణంగా తొక్కిసలాటలు జరిగాయి. బైరాగిపట్టెడ వద్ద తోపులాటలో భక్తులకు గాయపడగా.. మరికొందరు ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో పోలీసులు, తోటి భక్తులు CPR చేసి వారిని రక్షించే ప్రయత్నం చేసిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

35

తిరుప‌తి తొక్కిస‌లాట‌.. వెలుగులోకి షాకింగ్ విష‌యాలు 

ద‌ర్శ‌నం టోకెన్ల జారీ క్ర‌మంలో భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తుల‌ రద్దీ, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల తొక్కిస‌లాట జ‌రిగింది. పిల్లలు, వృద్ధులతో సహా చాలా మంది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. పోలీసులు ఒక్క‌సారిగా గేట్లు తెర‌వ‌డంతో భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. భ‌క్తుల సంఖ్య‌పై టీటీడీ స‌రైన అంచ‌నాల‌తో ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డం కూడా తొక్కిస‌లాట‌కు కార‌ణంగా ఉంది. 

సీఎం చంద్ర‌బాబుకు నివేదిక‌

తిరుప‌తి తొక్కిస‌లాట‌కు సంబంధించి అధికారులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు నివేదిక‌లు అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వ‌ల్ల ఒక్క‌సారిగా భ‌క్తులు రావ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగింద‌న్నారు. ఆ త‌ర్వాత డీఎస్పీ స‌రిగా స్పందించ‌లేద‌నీ, ఎస్పీ సిబ్బందితో వ‌చ్చి వెంట‌నే  భ‌క్తుల‌కు సాయం చేసిన‌ట్టు సంబంధిత నివేదిక‌లు పేర్కొంటున్నాయి. అలాగే, అంబులెన్స్  డ్రైవ‌ర్ తీరును కూడా ఇందులో ప్ర‌స్తావించారు.  అంబులెన్స్ ను డ్రైవ‌ర్ టికెట్ కౌంట‌ర్ బ‌య‌ట పార్క్ చేసి వెళ్లిన‌ట్లు, ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత 20 నిమిషాల వ‌ర‌కు  అత‌ను అందుబాటులో రాలేద‌ని నివేదిక పేర్కొంది.

45

తొక్కిసలాటకు ప్రధాన కారణం అదే.. : టీటీడీ ఈవో శ్యామలరావు

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తొక్కిసలాటపై స్పందించారు. డీఎస్పీ గేటు తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని అన్నారు. అలా చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగివుంటుందని ఆయన చెప్పారు. దీనిపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశముందని వెల్లడించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలో ఎవరి ప్రాణాలకు ముప్పు లేదన్నారు. రెండు మూడు రోజుల్లో గాయపడిన వారు కోలుకుంటారనీ, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.

తిరుప‌తి తొక్కిస‌లాట‌.. 40 మంది డిశ్చార్జ్

తిరుప‌తి తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారిలో 40 మందిని డిశ్చార్జ్  చేశామ‌ని అధికారులు తెలిపారు. 48 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌నీ, వారిని స్థానికంగా ఉన్న రుయా ఆస్ప‌త్రి, స్విమ్స్ ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. ఆస్ప‌త్రిలో  చికిత్స పొందుతున్న వారిలో 40 మందిని డిశ్చార్జ్ చేశారు. ఇంకా కొంత మంది చికిత్స పొందుతున్నారు.

 

55

తిరుపతికి సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్

తిరుపతి తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటి  సీఎం పవన్ కళ్యాణ్ తన కర్నూల్ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను ఆయన పరిశీలించాల్సి ఉంది. పవన్ గురువారం మధ్యహన్నం తిరుపతికి వెళ్లనున్నారు.  తొక్కిసలాటలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు.

అలాగే, సీఎం చంద్రబాబు నాయుడు కూడా తిరుపతి వెళ్లనున్నారు. స్విమ్స్ లో 13 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడకు వచ్చి బాధితులను పరామర్శించనున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
IT: ఇక హైద‌రాబాద్‌, చెన్నై వెళ్లాల్సిన ప‌నిలేదు.. సాఫ్ట్‌వేర్‌కి అడ్డాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌రో న‌గ‌రం
Recommended image2
Andhra pradesh: ఏపీలోని ఈ ప్రాంతంలో అడిడాస్ కంపెనీ.. 20 వేల మందికి ఉద్యోగాలు
Recommended image3
Cyclone Alert : బలపడుతోన్న అల్పపీడనం, తుపాన్ లోడింగ్? ఈ 9 జిల్లాల్లో కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved