MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • కారులో సజీవదహనమైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజు.. హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

కారులో సజీవదహనమైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజు.. హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

రాష్ట్ర వ్యాప్తంగా సంచనలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజు హత్య కేసులో ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ ఆడియో ప్రకారం.. 

2 Min read
Bukka Sumabala
Published : Apr 06 2023, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చేస్తున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడు పల్లెలో సాఫ్ట్వేర్ ఉద్యోగి సజీవ దహనం కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు నాగరాజు చనిపోవడానికి తమ్ముడి వివాహేతర సంబంధం కారణమని అనుకుంటున్నారు. అయితే దీంతో పాటు ఆర్థిక కారణాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయని తెలుస్తోంది. నాగరాజు హత్యకేసులో నిందితుడైన రిపుంజయ, మృతుడు నాగరాజు..  హత్యకు ముందు రోజు కూడా ఫోన్లో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన  ఆడియో లీక్ అయింది. నాగరాజును చంపాలన్న మర్డర్ మోటివ్ వెనుక, అక్రమ సంబంధంతో పాటు, నగదు లావాదేవీలు కూడా ఉన్నట్లుగా దీంతో వెలుగు చూసింది.

24

ఈ ఫోన్ సంభాషణలో నాగరాజు, రిపుంజయ మాట్లాడిన విషయాలు ఉన్నాయి. ఈ ఆడియో ప్రకారం.. రిపుంజయ పురుషోత్తం అన్న నాగరాజును మీ అంత చూస్తానని బెదిరించాడు. నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటారా అంటూ  ప్రశ్నించాడు. దీంతో రిపుంజయ అది కాదు విషయం ఏంటో చెబితే తమ్ముడితో క్షమాపణలు చెప్పిస్తానని కూడా చెప్పాడు. ఎంత చెప్పినా రిపుంజయ వినలేదు. ఆవేశంతో అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అది విని తట్టుకోలేని నాగరాజు తిరగబడ్డాడు. అప్పటికే రిపుంజయ నాగరాజు దగ్గర అప్పు చేసి ఉండడంతో…  తన డబ్బులు తనకు ఇచ్చేయాలంటూ  నాగరాజు  అడిగాడు. దీంతో మరింత కక్ష పెంచుకున్న రిపుంజయ నాగరాజును  హతమార్చాడు.
 

34

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు ఈ మొత్తం ఘటనలో  తమ్ముడి కోసం బలి అయినా అన్న.  ఆయన తిరుపతి వెళ్లి వస్తుండగా గంగుడు పల్లె దగ్గర కారులో మంటలు చెలరేగి కాలి బూడిదయ్యింది. కారులో ఉన్న నాగరాజు అందులోనే సజీవ దహనం అయ్యాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వస్తువులు, కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడిని నాగరాజుగా గుర్తించి.. దర్యాప్తు ప్రారంభించారు. 
 

44

అది ప్రమాదం కాదని హత్య అని, మృతుడి తమ్ముడి వివాహేతర సంబంధమే దీనికి కారణమని తెలిసింది. నాగరాజు తమ్ముడు పురుషోత్తంకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.రెండు కుటుంబాల మధ్య ఈ విషయంగా పంచాయతీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజు హత్య జరిగింది. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved