MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • అభివృద్ధి అంతా చంద్రబాబు చేసిందే.. ఇక వైసీపీకి మృత్యుగంటలు.. రఘురామ

అభివృద్ధి అంతా చంద్రబాబు చేసిందే.. ఇక వైసీపీకి మృత్యుగంటలు.. రఘురామ

వైసీపీకి మృత్యగంటికలు మోగుతున్నాయని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. అభివృద్ది అంతా చంద్రబాబు చేసిందేనన్నారు. 

2 Min read
Author : Bukka Sumabala
| Updated : May 30 2023, 09:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఢిల్లీ : వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు.  చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తరువాతి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని.. అహర్నిశలు పాటుపడ్డారని.. అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబు నిలిచారని  ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మహానాడులో ప్రవేశపెట్టిన తొలి మేనిఫెస్టోపై ఆయన వ్యాఖ్యానించారు.  మేనిఫెస్టోలో నాలుగు కీలక అంశాలు ఉన్నాయని.. వాటిని చూసిన మహిళలు, యువత అందరూ కూడా ఒక్క ఓటు తప్పిపోకుండా టీడీపీకి వేస్తారన్నారు. ఈ మాటలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు.  చంద్రబాబు నాయుడు చేస్తాను అని చెబుతున్నది.. నిజమైన సంక్షేమం  అని తెలిపారు.

38

ఇక టిడిపి మేనిఫెస్టో చూసిన తర్వాత తమ పార్టీలో వారికి నిద్రలు పట్టడం లేదు. పనిగట్టుకుని కొంతమందిని రంగంలోకి దింపింది. వారి పని విమర్శలు గుప్పించడమే. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం మహానాడుకు టిడిపి శ్రేణులు వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించింది. అయినా కూడా లక్షలాదిమంది తరలివచ్చారు.

48

మహానాడులోని ఆ జన సందోహాన్ని చూస్తే.. అధికార పార్టీ అయిన.. మా సొంత పార్టీ వైసీపీ  ప్రభుత్వానికి మృత్యుగంటలు మోగుతున్నాయని.. స్పష్టంగా అర్థమవుతుంది. సంక్షేమం.. సంక్షేమం.. అంటూనే.. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసింది మా పార్టీ..’ అంటూ ధ్వజమెత్తారు. 

58

రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలను పరిశ్రమల్లో వాటాలు అడుగుతూ ప్రభుత్వ పెద్దలు తరిమికొట్టారని విమర్శించారు.ఇలా రాష్ట్రానికి రావలసిన ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.

68
Chandrababu

Chandrababu

చంద్రబాబునాయుడు పేరు ఓటుకు నోటు అభియోగపత్రంలో లేదని గుర్తు చేశారు. అయినా కూడా జగన్ చంద్రబాబు నాయుడుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారన్నారు.  

78

కానీ,  ప్రస్తుతం వైఎస్ వివాకానంద రెడ్డి హత్య కేసు అభియోగపత్రంలో జగన్ పేరు ఉందన్నారు.  అయినా కూడా దానిమీద జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంజాయిషీ ఇవ్వడం లేదన్నారు. 

88

ఈ కేసులో వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సిబిఐ సుప్రీంకోర్టులో సవాలు చేయాలని రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కోరారు.

 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image2
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved