ఆటో నడిపిన మంత్రి రోజా.. ఫోటోలు..!
ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు.

Roja Auto
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. ఆటో నడిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ లో వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే
Roja
ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించిన ఆమె.. తదుపరి కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆమె ఆటో నడిపి సందడి చేశారు.
Roja
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు.
Roja
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద వాళ్ళ కోసం దృష్టి పెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో నేడు వాహన మిత్ర ద్వారా రూ. 262 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి రోజా పేర్కొన్నారు.
అనంతరం పర్యాటక శాఖ మంత్రి, ఎం.పి. గురుమూర్తి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి , జిల్లా ఎస్.పి పరమేశ్వర రెడ్డి , గ్రంధాలయ చైర్మన్ మధుబాల లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించి మెగా చెక్ ను అందించారు