MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Andhra Pradesh
  • 100 రోజుల్లో 10వేల కొత్త షాపులు... ఇక అన్ని సరుకులు అక్కడే..: నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన

100 రోజుల్లో 10వేల కొత్త షాపులు... ఇక అన్ని సరుకులు అక్కడే..: నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ లో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అందులో భాగంగానే పేదలకు నాణ్యతతో కూడిన సరుకుల కోసం ఏకంగా 10 వేల షాపులను ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 12 2024, 10:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Nadendla Manohar

Nadendla Manohar

100 రోజుల ప్రణాళికలో భాగంగా పౌరసరఫరాల శాఖ బకాయిల్లో రూ. 10 వేల కోట్లు తిరిగి చెల్లించడంతో పాటు 10 వేల కొత్త రేషన్ షాపులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫెయిర్ ప్రైస్ షాపులు తీసుకువచ్చి బియ్యం, కందిపప్పుతోపాటు చక్కెర, ఫామ్ ఆయిల్ ఇతర నిత్యావసరాలు అందచేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో బియ్యం నాణ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Nadendla Manohar

Nadendla Manohar

ఇవాళ (సోమవారం) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రైతులకు గత ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను మంత్రి నాదెండ్ల విడుదల చేసారు. అమలాపురంలో జరిగిన ఈ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 10,450 మంది రైతుల ఖాతాల్లో రూ. 191.84 కోట్ల బకాయిలను జమచేసారు. ఇకపై ఇలా దాన్యం డబ్బుల కోసం రైతులు నెలలతరబడి ఎదురుచూడాల్సిన అవసరం వుండదని... కేవలం 48 గంటల్లో సొమ్ము అన్నదాత అకౌంట్లో పడేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
 

36
Nadendla Manohar

Nadendla Manohar

కూటమి ప్రభుత్వం కేవలం పారిశ్రామివేత్తలకే కాదు రైతులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర అభివృద్దిలో రైతుల పాత్ర కూడా చాలా వుంటుంది... కాబట్టి వారికి ప్రతి అడుగులో ఎర్రతివాచీ వేస్తామన్నారు. రైతులు విత్తనాల కొనుగోలు చేసేటప్పటి నుండి ధాన్యం అమ్ముకునే వరకు ప్రభుత్వమే అన్ని చూసుకుంటుంది.. ఇందుకోసం సింగిల్ విండో తరహా విదానాన్ని అనుసరిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ రంగ పటిష్టతకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల హామీ ఇచ్చారు.  
 
 

46
Nadendla Manohar

Nadendla Manohar

ఎన్నికల వేళ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక తు.చ తప్పకుండా పాటిస్తున్నామని అన్నారు.   ప్రజల పక్షాన నిలబడి నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో కోనసీమ గ్రామాల్లో పర్యటించి రైతుల దుస్థితి ప్రత్యక్షంగా తెలుసుకున్నామన్నారు. గ్రామాల్లో 80శాతానికి పైగా వున్న కౌలు రైతులను గత ప్రభుత్వం పట్టించుకున్నవారే లేకుండా పోయారన్నారు. కౌలు రైతుల కృషిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది... అందువల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ నాదెండ్ల ఆందోళన వ్యక్తం చేసారు. 

56
Nadendla Manohar

Nadendla Manohar

కూటమి ప్రభుత్వ ఏర్పాటుతర్వాత రైతు బకాయిల మీద సమీక్ష జరిపితే ఒక్క పౌరసరఫరాల శాఖ ద్వారానే రూ. 40 వేల కోట్ల రుణాలు సేకరించి ఇతర కార్యక్రమాలకు వాడేసిన విషయం బయటపడిందన్నారు. అందులో ఒక్క రూపాయి కూడా రైతు శ్రేయస్సు కోసమో, ధాన్యం కొనుగోళ్ల కోసమే వాడింది లేదన్నారు. వెళ్తూ వెళ్తూ రైతుల నుంచి ధాన్యం కొన్న బకాయిలు రూ.1674 కోట్లు వదిలేసిపోయారన్నారు. గత ప్రభుత్వం 84 వేల మంది రైతులకు ఇచ్చిన మాట తప్పిందని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. అయితే ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ బకాయిలను నెల రోజులలోపు చెల్లించే ప్రయత్నం చేశామన్నారు. ఈ క్రమంలోనే జులై 4న వెయ్యి కోట్లు, ఈ రోజు మిగిలిన రూ. 674 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. 
 

66
Nadendla Manohar

Nadendla Manohar

గత ప్రభుత్వంలో పేదలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యం దళారులను పెట్టి దోచుకుని ఓడల్లో విదేశాలకు ఎత్తుకుపోయి అమ్ముకున్నారని ఆరోపించారు. కాకినాడ పట్టణంలోని గోడౌన్లలో 52 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకుంటే అందులో 22 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం ఉందని గుర్తుచేసారు. కొంత మంది పెద్దలు పేదల పొట్టకొట్టి దోచుకున్న బియ్యం ఇది అని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
Recommended image2
Now Playing
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami
Recommended image3
Andhra pradesh: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం.. రాష్ట్ర‌వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved