MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • విద్యుత్ షాక్ తో చనిపోతే పరిహారం కాదు... వారిపై చర్యలుంటాయ్..: మంత్రి గొట్టిపాటి వార్నింగ్

విద్యుత్ షాక్ తో చనిపోతే పరిహారం కాదు... వారిపై చర్యలుంటాయ్..: మంత్రి గొట్టిపాటి వార్నింగ్

ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ ఉన్నతాాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెంట్ షాక్ తో జరుగుతున్న మరణాలపై ఆయన కీలక కామెంట్స్ చేసారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 17 2024, 11:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
gottipati ravikumar

gottipati ravikumar

అమరావతి : వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ షాక్ సమస్య పెరిగిపోతుంది. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడి కొన్నిసార్లు, బాగా తడిసిన స్తంబాల్లో, గోడల్లో విద్యుత్ ప్రసరణ...  ఇలా అనేక విధాలుగా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి వర్షాకాలంలో విద్యుత్ షాక్ లతో మరణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రమాదాలపై చర్చించేందుకు  మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులు వర్చువల్ సమావేశం నిర్వహించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు విద్యుత్ షాక్ తో చనిపోయిన వారి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ప్రమాదాల కారణంగా ప్రాణనష్టాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు విద్యుత్ షాక్ తో చనిపోయిన వారు ఎలా మరణించారో రిపోర్టు తయారు చేయాలని పేర్కొన్నారు. అధిక ప్రాణ నష్టం ఏ విధంగా జరుగుతుందో అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు మంత్రి గొట్టిపాటి. 

35
Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

భూమి దగ్గర కరెంట్ వైర్లు వేలాడటం వలన చాలామంది ప్రజలే కాదు సిబ్బంది కూడా షాక్ కు గురయి చనిపోతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. కాబట్టి రాష్ట్ వ్యాప్తంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని రవికుమార్ ఆదేశించారు. 

45
Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

విద్యుత్ లైన్ల మరమ్మతులపై ప్రత్యేకంగా దృష్టి సారించి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తర్వాతి సమీక్షా సమావేశం నాటికి అధికారులందరు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సమస్యను తక్షణనే పరిష్కారానికి చొరవ చూపాలని... అలాకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  
 

55
Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar


విద్యుత్ షాక్ తో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదు... అసలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రభుత్వం తమదని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం నష్టపోయిన ప్రతీ కుటుంబానికి న్యాయం చేస్తుందని  గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Recommended image2
Now Playing
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
Recommended image3
Now Playing
Nara Lokesh Speech: గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved