MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • విజయవాడకు ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం..! చంద్రబాబు సర్కార్ చొరవతో కేంద్రం కీలక నిర్ణయం

విజయవాడకు ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం..! చంద్రబాబు సర్కార్ చొరవతో కేంద్రం కీలక నిర్ణయం

మచిలీపట్నం ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.  విజయవాడకు ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేసారు. అదెలాగంటే...

2 Min read
Arun Kumar P
Published : Aug 14 2024, 05:47 PM IST| Updated : Aug 14 2024, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
machilipatnam

machilipatnam

మచిలీపట్నం : బందరు ప్రజల చిరకాల కోరిక త్వరలోనే తీరనుందని ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎప్పటినుండో కోరుతున్న మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌కు మార్గం సుగమ అయ్యిందని ఆయన తెలిపారు. ఈ లైన్ ప్రజా రవాణాతో పాటు వాణిజ్య పరంగానూ లాభసాటిగా ఉంటుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్, గనులు, భుగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీలో పర్యటిస్తున్నారు. తన మంత్రిత్వశాఖలకు చెందిన పనులతో పాటు సొంత నియోజకవర్గం మచిలీపట్నం అభివృద్దికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలుస్తున్నారు రవీంద్ర. ఈ క్రమంలోనే రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి  మచిలీపట్నం - రేపల్లే మధ్య 45 కిలోమీటర్ల రైల్వే లైన్ ను పూర్తిచేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు రవీంద్ర. 
 

25
Chandra Babu

Chandra Babu

ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ... గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు. కానీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది... మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు.  మచిలీపట్నం‌-రేపల్లె వాసుల దశాబ్దాల కోరికైన రైల్వే లైనును పూర్తి చేయడమే కూటమి లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. 

35
machilipatnam

machilipatnam

మచిలీపట్నం దశాబ్దాల క్రితమే అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార రంగాల్లో కీలకంగా వ్యవహరించిందని రవీంద్ర పేర్కొన్నారు. ఇప్పుడు మచిలీపట్నం-రేపల్లే మార్గం పూర్తయితే ఇటు చెన్నై - కలకత్తా మార్గంలో చాలా వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు. అలాగే దూరం కూడా 100 కిలోమీటర్లకు పైగా తగ్గుతుందన్నారు. ప్రత్యేకంగా సరుకు రవాణా రైళ్లను విజయవాడ వైపు కాకుండా మచిలీపట్నం వైపుగా మళ్లించవచ్చు.. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ లో రద్దీ తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాల పరిధిలోని ప్రజలకు ప్రయాణం సులువుగా మారుతుందని మంత్రి రవీంద్ర తెలిపారు. 
 

45
Kollu Ravindra

Kollu Ravindra

ఇక మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనుల్ని కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఈ రైలు మార్గం కూడా అందుబాటులోకి వస్తే ఎగుమతుల ద్వారా ఆదాయం కూడా ఆశించిన మేర లభిస్తుందన్నారు. ప్రత్యేకంగా మత్స్య ఎగుమతులు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడుతున్న అమరావతి కూడా సమీపంలోనే ఉంటుంది... కాబట్టి మచిలీపట్నం నుండి అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో ఉండే పోర్టు కావడంతో ఈ రైల్వే లైనుకు ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా ఉన్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. 
 

55
Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటుకు ఉన్న ప్రాముఖ్యత అర్ధమైందని... వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చినట్లు రవీంద్ర తెలిపారు. తీర ప్రాంతంలో రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా ఉన్న ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, తొలి దశలో మచిలీపట్నం - రేపల్లె లైన్ పూర్తి చేసి, మలి దశలో నర్సాపురంకు అనుసంధానించే ప్రణాళిక కూడా ఉందని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. ఈ మార్గం పూర్తి చేయడం ద్వారా తీర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి ఎక్కువగా అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి వివరించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved