పవన్ కళ్యాణ్ శ్రీవారి దర్శనం: భక్తి రసం పండిస్తూ (ఫోటోలు)
పవన్ కళ్యాణ్ శ్రీవారి దర్శనం: భక్తి రసం పండిస్తూ (ఫోటోలు)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడకు వెళ్లిన జనసేనాని ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
పూర్తి సంప్రదాయ వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.
బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేన పార్టీకి ఇస్తున్న ప్రాధాన్యం రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఇవ్వడం లేదని అన్నారు
తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేదానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చామని, మరో వారంలో దీనిపై ప్రకటన ఉండొచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు.