MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • పాస్‌పోర్ట్ రెన్యూవల్ కు హైకోర్టు ఆదేశం.. విదేశాలకు జగన్.. ఏం మాస్టర్ ప్లాన్ చేయబోతున్నారు?

పాస్‌పోర్ట్ రెన్యూవల్ కు హైకోర్టు ఆదేశం.. విదేశాలకు జగన్.. ఏం మాస్టర్ ప్లాన్ చేయబోతున్నారు?

YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మరో ఐదు సంవత్సరాలకు గానూ తన పాస్ పోర్టును రెన్యూవల్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ విదేశీ పర్యటనలు హాట్ టాపిక్ అవుతున్నాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 11 2024, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టు రెన్యూవల్ కోసం ఆదేశాలు ఇచ్చింది. తన పాస్ పోర్టును రెన్యూవల్ చేసేలా ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జగన్ పాస్ పోర్టును మరో 5 సంత్సరాలకు గానూ రెన్యూవల్ చేయాలని ఆదేశించింది. అలాగే, అంతకుముందు విజయవాడ కోర్టు విధించిన రూ.25 వేల పూచీకత్తును చెల్లించాల్సిందేనని పేర్కొంది. దానిని రద్దు చేయడానికి నిరాఖరించింది. 

24

వివిధ కేసులను ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉండ‌టంతో ఆయ‌న‌కు పాస్ పోర్టు పొందేందుకు పెద్ద‌గా స‌మ‌స్య‌లు రాలేదు. దీంతో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు ఆటంకం క‌ల‌గ‌లేదు. అయితే, ముఖ్య‌మంత్రి ప‌దవి కోల్పోయిన త‌ర్వాత పాస్ పోర్టు స‌మ‌స్య‌లు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించారు.

త‌న పాస్ పోర్టు రెన్యువల్ కోసం నిరభ్యంతర పత్రం (ఎన్ వోసీ) జారీ చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 11న ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. సీబీఐ కోర్టు ఐదేళ్ల పాటు ఎన్ వోసీ ఇచ్చినందున ఏడాది పాటు ఎన్ వోసీ ఇవ్వడం తమ పరిధికి అతీతమని పేర్కొంటూ ప్రత్యేక కోర్టు విధించిన షరతులను జగన్ మోహన్ రెడ్డి సవాలు చేశారు.

34
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

ఈ క్ర‌మంలోనే కోర్టు తాజాగా జ‌గ‌న్ పాస్ పోర్టును రెన్యూవ‌ల్ చేయాల‌ని ఆదేశాలు ఇచ్చింది. దీంతో యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు వెళ్లేందుకు ఐదేళ్ల పాటు రెగ్యులర్ పాస్ పోర్టు పొందేందుకు కోర్టు ఆదేశాలు రావ‌డంతో జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌ల‌కు మార్గం సుగ‌మం అయింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కే కృపాసాగర్ తన తీర్పును వెలువరించారు.

 సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు యూకే వెళ్లేందుకు కొన్ని షరతులకు లోబడి ఐదేళ్ల పాటు పాస్పోర్టు ఇచ్చేందుకు హైదరాబాద్ లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఇప్పటికే ఎన్వోసీ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారని పేర్కొంటూ ఏడాది కాలానికి పాస్ పోర్టు జారీ/రెన్యువల్ కు ఎన్వోసీ మంజూరు చేయాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి విచారణ త‌ర్వాత తాజా ఆదేశాలు ఇచ్చారు.

 

44

ముఖ్య‌మంత్రి ప‌దవిని కోల్పోయిన త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేస్తున్న తొలి విదేశీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తి నెల‌కొంది. జ‌గ‌న్ ఇప్పుడు ఎందుకు విదేశాల‌కు వెళ్తున్నార‌ని రాజకీయ వ‌ర్గాల‌తో పాటు ప్ర‌జ‌ల్లో కూడా క్యూరియాసిటీ పెరిగింది. 

కాగా, ఒక్క సీబీఐ కోర్టులోనే జగన్‌పై 26 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మే 17న తమ ఇద్దరు కూతుళ్లను కలిసేందుకు తన భార్య భారతితో కలసి లండన్ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Recommended image2
Now Playing
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu
Recommended image3
Now Playing
New Year Celebrations: కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన రామ్మోహన్ నాయుడు | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved