షాకింగ్.. రోజుల తరబడి ఇంట్లోనే శవం.. కుళ్లి కంపుకొడుతున్నా..
ఇంట్లో మనిషి చనిపోయి.. శవం కుళ్లి కంపు వాసన కొడుతున్నా ఆ కుటుంబసభ్యులకు ఏ మాత్రం తేడా తెలియలేదు. చివరికి వీధిలో వాళ్లు వాసన భరించలేక పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరిగింది.
ఇంట్లో మనిషి చనిపోయి.. శవం కుళ్లి కంపు వాసన కొడుతున్నా ఆ కుటుంబసభ్యులకు ఏ మాత్రం తేడా తెలియలేదు. చివరికి వీధిలో వాళ్లు వాసన భరించలేక పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరిగింది.
శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యనగర్ కాలనీలో శుక్రవారం బయటపడ్డ ఈ ఘటన స్థానికుల్ని భయాందోళనలో ముంచేసింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలాకి సత్యనారాయణ ఇరిగేషన్ శాఖలో అటెండర్గా పని చేసి రిటైర్ అయ్యాడు.
ఇతనికి భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా ఆదిత్యనగర్ కాలనీలో సొంత ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇరుగుపొరుగు వారితో ఎప్పుడూ ఎలాంటి సబంధం లేదు. దీంతో వీరిని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కనీసం బైటికి రావడం, పోవడం కూడా కనిపించేది కాదు. సత్యనారాయణ ఒక్కడే అప్పుడప్పుడూ బైటికి వెళ్లి ఇంటికి కావాల్సిన సరుకులు అవి తెచ్చేవాడు.
ఈ క్రమంలోనే సత్యనారాయణ భార్య ఈశ్వరమ్మ(60) ఓ గదిలో చనిపోయారు. ఆమె చనిపోయిన విషయం కూడా కుటుంబసభ్యలు గుర్తించలేదు. దీంతో శవం కుళ్లిపోయి వాసన లేచింది. అది కూడా ఆ కుటుంబ సభ్యుల్లో కదలికనే తేలేకపోయింది. రోజురోజుకూ పెరిగిపోతున్న దుర్వాసనను భరించలేని స్థానికులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది, రెడ్క్రాస్ ప్రతినిధులు అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. మంచంపై కుళ్లిపోయి ఈశ్వరమ్మ శవం కనిపించింది. ఇళ్లంతా చెత్తతో నిండి ఉంది. అందులో ఉంటున్నవారంతా మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించారు.
వారిని ప్రశ్నించినా, సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం వీరు ఎవ్వరితోనూ మాట్లాడే వారు కాదని, ఇంటినిండా చెత్త ఉంచుకునేవారని తెలిసింది.
మానసికంగా ఇంట్లో అందరి పరిస్థితి ఒకేలా ఉందని తేలింది. అంతేకాదు జబ్బుపడ్డ ఈశ్వరమ్మకు తిండి లేకపోవడంతోనే చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు స్వర్గధామ రథంలో మృతదేహాన్ని రోటరీ శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.