MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఫైనాన్షియర్ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం : భార్య, ప్రేమికుడితో సహా ఆరుగురు అరెస్ట్

ఫైనాన్షియర్ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం : భార్య, ప్రేమికుడితో సహా ఆరుగురు అరెస్ట్

వివాహేతర సంబంధం నేపథ్యంలో విశాఖ పట్నంలో ఓ మహిళ తన భర్తను హత్య చేసి.. గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. మృతదేహంపై గాయాల గుర్తులు ఉండడంతో విచారించగా... 

2 Min read
Author : Bukka Sumabala
Published : May 02 2023, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

విశాఖపట్నం : భర్తను హతమార్చి కార్డియాక్ అరెస్ట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను, ఆమె ప్రేమికుడు, మరో నలుగురిని చోడవరం పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు ఎల్ హరి విజయ్ అనే ఫైనాన్షియర్ గా గుర్తించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఏఎస్‌ఆర్ జిల్లా జి మాడుగుల మండలం నేరేడువలస గ్రామానికి చెందిన హరి విజయ్ అనే ఫైనాన్షియర్ ఏఎస్‌ఆర్ జిల్లా ముంచింగిపుట్ మండలం చివుకుచింత గ్రామానికి చెందిన సామిరెడ్డి ప్రీతిని ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఆమె ఆరోగ్య బాగా లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం చికిత్స కోసం.. హరి విజయ్ తన కుటుంబంతో అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని మారుతీ నగర్‌కు వచ్చాడు. 

38

ప్రీతి తండ్రి శంకర్ రావు కూడా తమ కుమార్తె చికిత్స కోసం అక్కడికే షిప్ట్ అయ్యాడు. ఈ హత్య విచారణలో, చోడవరం నివాసి బిఎస్‌ఎస్ ప్రణయ్‌తో ప్రీతికి అక్రమ సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం ప్రీతి భర్తకు తెలియడంతో.. వారి సంబంధాన్ని వదులుకోమని హెచ్చరించాడు. 

48

అంతేకాదు ప్రీతిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడు. దీంతో ప్రీతి భర్తను చంపేందుకు తన తండ్రి, స్నేహితులు, ప్రేమికుడితో కలిసి కుట్ర పన్నారు’’ అని పోలీసులు తెలిపారు.

58

ప్రీతి తన తండ్రితో పాటు మరికొంత మందితో కలిసి ఏప్రిల్ 17న చోడవరం వద్ద హరి విజయ్‌ను హత్య చేసి, గుండెపోటుకు గురయ్యాడని తెలిపారు. మృతదేహాన్ని ఏఎస్‌ఆర్ జిల్లా పాడేరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.. అని పోలీసులు చెప్పారు.

68

పాడేరు పోలీసులు తొలుత సిఆర్‌పిసి సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతని మెడ చుట్టూ గుర్తులు ఉండడంతో దర్యాప్తు చేపట్టారు.

78

పాడేరు పోలీసులు శంకర్‌రావును విచారించగా.. హరి విజయ్‌ని ప్రీతి, తనతోపాటు మరికొందరు హత్య చేసినట్లు అంగీకరించారు. శంకర్‌రావును అరెస్టు చేసిన పోలీసులు కేసును చోడవరం పోలీసులకు బదిలీ చేశారు.

88

ప్రీతి, ఆమె ప్రేమికుడు, ఆమె తండ్రి ఏప్రిల్ 17 రాత్రి బాధితుడికి మద్యం తాగించి, ఆపై దిండు, దుప్పటితో అతనిని చంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి, ప్రణయ్, లాలిన్ కుమార్, కర్రి రాము, పిట్ల కొండ రాజు అలియాస్ బషీర్, ఆమె తండ్రి శంకర్ రావులను అదుపులోకి తీసుకున్నారు.

About the Author

BS
Bukka Sumabala
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
Recommended image2
Now Playing
విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour
Recommended image3
Now Playing
జగన్ ని చూడగానే కాళ్ళ మీద పడి బోరున ఏడ్చిన మత్స్యకార కుటుంబాలు | Jagan Visakhapatnam Tour
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved