- Home
- Andhra Pradesh
- వివాహేతర సంబంధం : మరో వ్యక్తితో కూడా వదిన చనువుగా ఉంటందని.. ఇద్దరిని హత్యచేసి.. తాను ఆత్మహత్య....
వివాహేతర సంబంధం : మరో వ్యక్తితో కూడా వదిన చనువుగా ఉంటందని.. ఇద్దరిని హత్యచేసి.. తాను ఆత్మహత్య....
తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ మరో యువకుడితో చనువుగా ఉంటోందని.. వారిద్దరినీ హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలోని సావురకోట కోదడ్డపనసలో వెలుగు చూసిన జంట హత్యల కేసులు నిందితుడైన ముద్దాడ రామారావు.. ఇద్దరిని హత్య చేసిన తర్వాత.. తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన ఈ విషాద ఘటనలో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు, ఆత్మహత్యలు జరిగినట్లుగా తేలింది.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ముద్దాడ రామారావు అనే వ్యక్తి.. వెలుమల ఎర్రమ్మ, ముద్దాడ సంతోష్ అనే ఇద్దరినీ మంగళవారం కత్తితో నరికి చంపిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత హత్యస్థలం నుంచి ముద్దాడ రామారావు పరారయ్యాడు. హత్యల విషయం వెలుగు చూడడంతో పోలీసులు అతని కోసం గాలించడం మొదలుపెట్టారు. కాగా ముద్దాడ రామారావు గ్రామ సమీపంలో వారిద్దరిని అంతం చేసిన కత్తితోనే గొంతు కోసుకొని మృతి చెందాడు.
ఈ మేరకు విగతాజీవిగా పడి ఉన్న రామారావును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ముద్దాడ రామారావు తనకు వరుసకు వదినయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే, ఆ మహిళ తనతో కాకుండా మరో యువకుడితో కూడా సంబంధం పెట్టుకుందని రామారావుకు అనుమానం వచ్చింది.
ఈ అనుమానంతోనే వదిన ఎర్రమ్మను, ముద్దాడసంతోష్ లను కత్తితో పొడిచి హత్య చేశాడు. మొదట మంగళవారం సాయంత్రం కోదడ్డ పనస గ్రామ సమీపంలోని వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లి పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మ మీద కూడా అదే కత్తితో దాడి చేశాడు. దీంతో ఎర్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత గ్రామశివారులోకి వెళ్లి అదే కత్తితో తాను గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.