తూ.గో జిల్లా గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే సీతక్క... ఎందుకోసమంటే
తూర్పు గోదావరి జిల్లా అటపాక మండలం చేమిలి వాగు గోత్తీ కోయ గూడెం, వి. ఆర్.పురం మండలంలోని సున్నం మట్కా గూడెం లో పర్యటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.
అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో పలు గ్రామాల్లో పర్యటించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క. తన పిహెచ్డి పరిశోధనలో భాగంగా ఆమె ఈ పర్యటన చేపట్టారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01ethfcvpzqpnq8cc5h2t4tmyk/seethakka2-jpeg_300x168xt.jpg)
తూర్పు గోదావరి జిల్లా అట పాక మండలం చేమిలి వాగు గోత్తీ కోయ గూడెం, వి. ఆర్.పురం మండలంలోని సున్నం మట్కా గూడెం లో పర్యటించారు సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఊరికి దూరంగా అడవిని నమ్ముకొని అడివే ఆధారంగా బ్రతుకుతున్న ఆదివాసీ, గోత్తి కోయ గూడెంలలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రజలు ఎదురు కుంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ఒక పుస్తకం ద్వారా తెలియ చేస్తానని సీతక్క అన్నారు. అదే విధంగా లయోలా ఇంటిగ్రెటెడ్ డెవలప్ మెంట్ సొసైటీ పాఠశాలలో విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభా కాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే సీతక్క.